ముస్లింల అభివృద్ధికి కృషి: ఎంపీ
ABN , Publish Date - Mar 31 , 2025 | 12:45 AM
ముస్లింల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎంపీ బస్తిపాటి నాగ రాజు అన్నారు.

కర్నూలు అర్బన, మార్చి 30(ఆంధ్రజ్యోతి): ముస్లింల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎంపీ బస్తిపాటి నాగ రాజు అన్నారు. ఆదివారం పంచలింగాల, నగరంలోని పాత ఈద్గాలో ముస్లింలకు ఇఫ్తార్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ ప్రార్థనలు చేసి, రంజాన శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలకు అనేక సంక్షేమ పథకా లను ప్రవేశపెడుతుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.