Lars Labs Investment: రాష్ట్రంలో లారస్ ల్యాబ్స్ 5 వేల కోట్ల పెట్టుబడులు
ABN, Publish Date - Apr 04 , 2025 | 06:54 AM
రాష్ట్రంలో లారస్ ల్యాబ్స్ సంస్థ అనకాపల్లిలో రూ. 5వేల కోట్ల పెట్టుబడితో బల్క్ డ్రగ్ పరిశ్రమను నెలకొల్పడానికి ముందుకు వచ్చింది. ఈ పరిశ్రమ ద్వారా 7,500 మందికి ఉద్యోగాలు కల్పించేందుకు అవకాశం ఉంటుంది

అనకాపల్లి వద్ద బల్క్ డ్రగ్ పరిశ్రమ ఏర్పాటు
ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన సంస్థ ప్రతినిధులు
అమరావతి, ఏప్రిల్ 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బల్క్ డ్రగ్ పరిశ్రమ ఏర్పాటుకు లారస్ ల్యాబ్స్ సంస్థ ముందుకు వచ్చింది. అనకాపల్లి జిల్లా గోరపూడి గ్రామంలోని ఐపీ రాంబిల్లి ఫేజ్-2లో దాదాపు రూ.5వేల కోట్ల పెట్టుబడితో పరిశ్రమను నెలకొల్పనుంది. దీనిద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 7,500 మందికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. లారస్ ల్యాబ్స్ ఏర్పాటు చేయనున్న కొత్త పరిశ్రమలకు భూములు కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత తెలిపింది. ఈ నేపథ్యంలో ఆ సంస్థ సీఈవో చావా సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ చావా నరసింహారావు గురువారం రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిసి చర్చలు జరిపారు. తమ పరిశ్రమలకు భూకేటాయింపులు చేసినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇవి కూడా చదవండి
కళ్లను బాగా రుద్దుతున్నారా.. జాగ్రత్త
Vijay Kumar ACB Questioning: రెండో రోజు విచారణకు విజయ్ కుమార్.. ఏం తేల్చనున్నారో
Read Latest AP News And Telugu News
Updated Date - Apr 04 , 2025 | 06:54 AM