ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మహిళాసెల్ చైర్పర్సన్గా రజిత
ABN , Publish Date - Apr 09 , 2025 | 12:17 AM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిలా మహిళావిభాగం చైర్పర్సన్గా కాట్రగడ్డ రజిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఏకగ్రీవంగా ఎన్నిక
ఒంగోలు కలెక్టరేట్, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యో తి): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిలా మహిళావిభాగం చైర్పర్సన్గా కాట్రగడ్డ రజిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక సం ఘం కార్యాలయంలో మంగళవారం సంఘం జిల్లా అధ్యక్షుడు చిన్నపురెడ్డి కిరణ్కుమార్ అ ధ్యక్షతన జరిగిన సమావేశంలో సంఘం మ హిళావింగ్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మహిళా విభాగం చైర్పర్సన్ గా రజిత, జిల్లా కన్వీనర్గా వనజ, ట్రెజరర్గా ప్రసన్న, కో చైర్మన్లుగా శ్రీదేవి, అనుపమ, గు రుదేవి, సునీత, కో కన్వీనర్లుగా సుజాత, నా గమణి, త్రివేణి, ప్రసన్న, జి.సుజాత, ప్రతిమల ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ రజిత మాట్లాడుతూ జిల్లాలో వివిధ శాఖల్లోని మహిళా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్య లపై చర్చించి ఆయా శాఖల అధికారుల దృ ష్టికి తీసుకెళ్ళి పరిష్కరించేలా కృషి చేస్తామని చెప్పారు. తనను జిల్లా చైర్పర్సన్గా ఎన్నుకో వడం పట్లపై ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలి పారు. కార్యక్రమంలో సంఘం జిల్లాకార్యదర్శి వరకుమార్, శ్రీనివాస్, మోటార్ శ్రీనివాసరావు, సురేష్బాబు, గోపీకృష్ణ, బాబురావు తదితరు లు పాల్గొన్నారు.