సాహిత్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదీ
ABN , Publish Date - Apr 06 , 2025 | 11:38 PM
సాహిత్యం సజీవమని, సమాజాన్ని నిర్దేశించే సాహిత్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని సాహితీవేత్త, రాష్ట్ర జానపద కళాకారుల సంఘం అధ్యక్షుడు కుమార్ నాయక్ అన్నారు.

పలాస, ఏప్రిల్ 6(ఆంధ్రజ్యోతి): సాహిత్యం సజీవమని, సమాజాన్ని నిర్దేశించే సాహి త్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని సాహితీవేత్త, రాష్ట్ర జానపద కళాకా రుల సంఘం అధ్యక్షుడు కుమార్ నాయక్ అన్నారు. ఆదివారం శ్రీరామనవమి సందర్భం గా స్థానిక లయన్స్క్లబ్ సమావేశ మందిరం లో జనజాగృతి సాహితి సాంస్కృతిక స మా ఖ్య ఆధ్వర్యంలో ఉత్కలాంధ్ర కవి సమ్మేళనం నిర్వహించారు. అనంతరం పలువురు కవులు స్వీయ కవితా పఠనాన్ని నిర్వహించారు. సాహితీవేత్తలు తెప్పల కృష్ణమూర్తి, ఉత్తరపల్లి నాగేశ్వరరావు, వెంకట రంగనాథం, వంకల రాజారావు, పందిరి మధూసూదనరావు, కోదం డ రామయ్య, బాలక లోకనాథం, దండా సి, బమ్మిడి సుబ్బారావు పాల్గొన్నారు.