ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Cell Phone: విద్యార్థిని ప్రాణంతీసిన సెల్‌ఫోన్‌.. ఏం జరిగిందంటే..

ABN, Publish Date - Apr 08 , 2025 | 01:26 PM

సెల్‌ఫోన్‌ ఓ విద్యార్థిని ప్రాణంతీసింది. ఎక్కడో దూరంగా వేరే రాష్ట్రంలో ఉన్న తన తండ్రితో సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ ఆదమరిచి డాబాపై నుంచి ఒక్కసారిగా కిందపడిపోయింది. గమనించిన చుట్టుపక్కలవారు ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది.

-సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ మిద్దెపై నుంచి జారిపడి విద్యార్థిని మృతి

చెన్నై: సెల్‌ఫోన్‌లో తండ్రితో మాట్లాడుతున్న విద్యార్థిని హఠాత్తుగా మిద్దెపై నుంచి జారిపడి మృతిచెందిన ఘటన విషాదం నింపింది. తిరునల్వేలి జిల్లా మేలూరు సమీపంలోని మానూరులోని ఓ కళాశాలలో చదువుతున్న కలైసెల్వి తల్లిదండ్రులు గుజరాత్‌(Gujarath)లో వ్యాపారం చేస్తున్నారు. కలైసెల్వి అవ్వ ఇంట్లో ఉంటోంది. ఈ నెల 1వ తేది ఇంటి మిద్దెపై సెల్‌ఫోన్‌(Cell Phone)లో తండ్రితో మాట్లాడుతున్న కలైసెల్వి హఠాత్తుగా కాలుజారి కిందపడింది.

ఈ వార్తను కూడా చదవండి: Heavy Rains: ఈరోడ్‌లో వర్షబీభత్సం.. అరటి తోటలు ధ్వంసం


తీవ్రంగా గాయపడిన ఆమెను చుట్టుపక్కల వారు ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స అందిస్తుండగానే మృతిచెందింది. తల్లిదండ్రుల అనుమతితో కలైసెల్వి అవయవాలు దానంగా తీసుకున్న వైద్యులు, ఆమె మృతదేహానికి ప్రభుత్వం తరఫున నివాళులర్పించి తల్లిదండ్రులకు అప్పగించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

బిల్లుల కోసం సత్యాగ్రహం చేస్తాం

ఉదయం ఎండ .. సాయంత్రం వాన

నగరంలో కొత్తగా 6 ఎంఎంటీఎస్‌ ట్రైన్‌ లైన్లు

Read Latest Telangana News and National News

Updated Date - Apr 08 , 2025 | 01:26 PM