Share News

MGNREGA Reforms: ఉపాధి పథకంపై స్వతంత్ర సర్వే

ABN , Publish Date - Apr 14 , 2025 | 04:43 AM

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై పార్లమెంటరీ కమిటీ సమగ్ర సర్వే చేయాలని సూచించింది. పనిదినాలను 150కి పెంచడం, వేతనాలను పెంచడం, ఆర్థిక అవకతవకలు నివారించేందుకు మార్పులు అవసరమని ప్రకటించింది

MGNREGA Reforms: ఉపాధి పథకంపై స్వతంత్ర సర్వే

  • పథకాన్ని పునర్వ్యవస్థీకరించాలి

  • పనిదినాలను 150కి పెంచాలి

  • పార్లమెంటరీ కమిటీ సిఫారసులు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 13: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు తీరును అంచనా వేసేందుకు స్వతంత్ర దర్యాప్తు సంస్థతో దేశవ్యాప్తంగా సమగ్ర సర్వే చేయించాలని పార్లమెంటరీ కమిటీ సూచించింది. మారుతున్న కాలానికి అనుగుణంగా అమలులో ఎదురవుతున్న సవాళ్లను దృష్టిలో ఉంచుకొని పథకాన్ని పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది. కాంగ్రెస్‌ ఎంపీ సప్తగిరి శంకర్‌ ఉలక నేతృత్వంలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌పై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ కమిటీ ఈ మేరకు ఒక నివేదికను గతవారం పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలలో ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఉన్న 100 పనిదినాలను 150కి పెంచాల్సిన అవసరం ఉందని కూడా కమిటీ సిఫారసు చేసింది.


రోజుకు కనీసం రూ.400 ఆర్జించేలా వేతనాలను పెంచాలని కూడా సూచించింది. పథకానికి నిధుల కేటాయింపుల్లో స్తబ్దతపై కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. పథకం సక్రమంగా అమలవడానికి సామాజిక తనిఖీలు పెంచాలని కూడా నొక్కి చెప్పింది. పథకంలో ఆర్థిక అవకతవకలు, ఉపాధి కూలీల సంతృప్తి, వేతనాల చెల్లింపుల్లో జాప్యం, భాగస్వామ్యమవుతున్న తీరుపై సర్వేలో దృష్టి కేంద్రీకరించాలని కమిటీ పేర్కొంది. ఆధార్‌ వివరాలు సరిపోలకపోవడం లేదా చిన్నపాటి అక్షర దోషాల కారణంగా 2021-22లో సుమారు 50.31 లక్షల జాబ్‌కార్డులు తొలగించారని కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. తద్వారా అర్హులైన కూలీలకు ఉపాధి పనులు దక్కడంలేదని తెలిపింది. పథకం నుంచి కూలీలను అన్యాయంగా తొలగించకుండా వ్యవస్థను తీసుకురావాలని కూడా కమిటీ సూచించింది..


ఈ వార్తలు కూడా చదవండి..

Capital Amaravati: మరో 30 వేల ఎకరాల భూ సమీకరణకు రంగం సిద్ధం

IAS Officers Transfer: ఏపీలో పలువురు ఐఏఎస్‌లు బదిలీ

AB Venkateswara Rao: కోడికత్తి శ్రీనుతో ఏబీ వెంకటేశ్వరరావు భేటీ.. వైఎస్ జగన్‌పై సంచలన వ్యాఖ్యలు

Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం..

TTD Board chairman: భూమనపై టీటీడీ బోర్డ్ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు

For National News And Telugu News

Updated Date - Apr 14 , 2025 | 04:43 AM