టీటీడీ అన్నదానం ట్రస్ట్కి పవన్ సతీమణి భారీ విరాళం
ABN, Publish Date - Apr 14 , 2025 | 02:04 PM
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తిరుమలలో భారీ విరాళాన్ని అందజేశారు.

తన కుమారుడు కోలుకోవాలంటూ శ్రీవారిని మొక్కుకున్నారు అన్నా కొణిదెల. మార్క్ శంకర్ త్వరగానే కోలుకోవడంతో మొక్కును తీర్చుకునేందుకు నిన్న ఆదివారం తిరుమలకు వచ్చారు.

పద్మావతి కళ్యాణ కట్టకు చేరుకుని.. శ్రీవారికి మొక్కుగా తలనీలాలు సమర్పించారు. రాత్రి తిరుమల్లోనే బస చేసిన అన్నా కొణిదెల..

కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవారిని పవన్ సతీమణి అన్నా లెజినోవా ఈరోజు సోమవారం సుప్రభాత సేవలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తిరుమలలో నిత్యాన్నదానికి రూ.17 లక్షల విరాళం అందజేశారు అన్నా కొణిదెల.

తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో అన్నా లెజినోవా అన్న ప్రసాదాన్ని స్వీకరించారు

ఈ సందర్భంగా గాయత్రి నిలయం వద్ద అన్నా లేజీ నోవాకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. టీటీడీ నిబంధనల ప్రకారం డిక్లరేషన్పై సంతకం చేసి ఆమె వరాహస్వామిని దర్శించుకున్నారు.

ఈరోజు (సోమవారం) అన్నదానంలో మధ్యాహ్నం భోజనానికి అయ్యే రూ.17 లక్షల రూపాయలను తన కుమారుడు మార్క శంకర్ పేరిట పవన్ సతీమణి విరాళంగా టీటీడీ అధికారులకు ఇచ్చారు.
Updated at - Apr 14 , 2025 | 02:04 PM