ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలి
ABN , Publish Date - Apr 12 , 2025 | 11:46 PM
ప్రజలకు మౌలిక సదుపా యా లను కల్పించి సమస్యలను సత్వమే పరిష్కారం చేయాలని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ అన్నారు.

బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు రఘునాథ్
నస్పూర్, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి) : ప్రజలకు మౌలిక సదుపా యా లను కల్పించి సమస్యలను సత్వమే పరిష్కారం చేయాలని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ అన్నారు. నస్పూర్ లోని సీతా రాంపల్లిలో శనివారం గావ్ చలో, బస్తీ చలో కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలోని రేషన్ షాపును సందర్శించారు. ఈ సంద ర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ సీతారాంపల్లిలో ముఖ్యంగా మురుగు కాలువలు, తాగునీరు, రోడ్ల సమస్యలు ఉన్నాయన్నారు. సింగరేణి ప్రాంతమైన కోట్ల రూపాయల ఆదాయం ఉన్న ప్రాంతం అభివృద్ధిపై శ్రద్ద చూపడంలేదన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఆకుల అశోక్ వర్థన్, ఆనంద్ కృష్ణ, రమేష్, పానుగంటి మధు, మిట్టపల్లి మొగిలి, ఈర్ల సదానందం, కుర్ర చక్రవర్తి, పొనగంటి సదయ్య, మా డిశెటి ్ట మహేష్ తదితరులు పాల్గొన్నారు.