కలెక్టర్లతో సీఎం భేటీ.. భూ భారతిపై

ABN, Publish Date - Apr 14 , 2025 | 04:45 PM

Revanth Collectors Meeting: భూ భారతి పోర్టల్ లాంఛ్ నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు.

హైదరాబాద్, ఏప్రిల్ 14: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్ని జిల్లాల కలెక్టర్లతో ఎమ్‌సీఆర్‌హెచ్‌ఆర్‌డీలో ఈరోజు (సోమవారం) సమావేశమయ్యారు. భూ భారతి పోర్టల్ (Bhu Bharati Portal) లాంఛ్ నేపథ్యంలో కలెక్టర్లకు సీఎం పలు సూచనలు చేయనున్నారు. సన్న బియ్యం పంపిణీలో అవకతవకలు జరగకుండా జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశాలు ఇవ్వనున్నారు సీఎం. అలాగే రాజీవ్ యువ వికాసం అర్హుల ఎంపిక, ఇందిరమ్మ ఇండ్ల అర్హుల ఎంపికలో ప్రభుత్వం ప్రాధాన్యతను కలెక్టర్లకు వివరించనున్నారు. ఎండాకాలంలో తీసుకోవలసిన చర్యలపైనా కలెక్టర్లకు ముఖ్యమంత్రి రేవంత్ దిశానిర్దేశం చేయనున్నారు.


ఇవి కూడా చదవండి

Falaknuma Crime News: వివాహమైన మూడు రోజులకే రౌడీషీటర్ దారుణ హత్య.. ఏం జరిగిందంటే

CM Revanth Praised Women: సన్నబియ్యంతో సహపంక్తి భోజనం.. మహిళకు సీఎం అభినందనలు

Read Latest Telangana News And Telugu News

Updated at - Apr 14 , 2025 | 04:45 PM