Home » 2024
మహాశివరాత్రిని పురస్క రించు కుని శింగనమలలోని భవాని శంకర స్వామి దేవాలయంలో బుఽ దవారం రాత్రి ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ కుటుంబ సభ్యుల ఆధ్వ ర్యంలో శివపార్వతుల కల్యాణోత్సవం కన్నుల పండువగా సాగింది. ఎమ్మెల్యే, కుటుంబ సభ్యులు బుధవారం మండలంలో ప్రసిద్ధి చెందిన శింగనమల చిన్నకాలువ భవాని శంకర దేవాలయం రాత్రి ప్రత్యేక పూ జలు నిర్వహించారు.
గత ఐదేళ్లలో వైసీపీ హయాంలో ఆలయాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ఆలయాలకు శోభ వచ్చిందని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్నారు.
మహాశివరాత్రి వేడు కలను బుధవారం జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఉదయం నుం చే శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ఊరూవాడా అంతటా శివ నామస్మరణతో మార్మోగింది. చిన్నా.. పెద్దా అందరూ ఆలయాలకు చేరుకుని ముక్కంటిని దర్శించుకున్నారు.
జిల్లా కేంద్రానికి కూత వేటు దూ రంలో ఉన్న మండలంలోని రాప్తాడు, ప్రసన్నాయపల్లి పశువైద్యశాలలకు పశు వైద్యాధికారులు, సిబ్బంది సకాలంలో హాజరు కారు. మధ్యాహ్నం తరువాత పూర్తిగా విధులకు డమ్మా కొడుతున్నారు.
సైబర్ నేరగాళ్ల చేతిలో జిల్లా ప్రజలు బాధితులు కాకూడదనేదే జిల్లా పోలీసుల ధ్యేయమని ఎస్పీ జగదీష్ స్పష్టం చేశారు. సైబర్ సేఫ్ అనంతపురం కోసం జిల్లా పోలీస్ శాఖ సైబర్ సురక్ష(మన భద్రత-మన బాధ్యత)లో భాగంగా చేపట్టిన 2.5కె రనను స్థానిక పోలీస్ పరేడ్ మైదానం వద్ద జిల్లా ఎస్పీ జెండా ఊపి మంగళవారం ప్రారంభించారు.
ప్రభుత్వం నుంచి వచ్చే సాయంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతి, భోజనం అందిం చాలని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ఆదేశించారు. ఆయన మంగళవారం నగరంలోని నవోదయ కాలనీలో ఉన్న గిరిజన బాలికల గురుకుల పాఠశా లను తనిఖీ చేశారు. విద్యార్థులకు అందించే భోజనాన్ని పరిశీలించి, సంతృ ప్తి వ్యక్తం చేశారు. ఇంకా చిన్నచిన్న మార్పులు చేస్తే బాగుంటుందని సూ చించారు.
మొదటిరోడ్డులోని కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయంలో నిర్వహిస్తున్న మహాశివరాత్రి బ్రహ్మో త్సవాల్లో భాగంగా ఏడోరోజు మంగళవారం కాశీవిశాలాక్షి సమేత విశ్శ్వేశ్వరు డు గజవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో ఉదయం శివలింగానికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పుష్పా లంకరణ, ప్రత్యేక పూజ నిర్వహించారు.
పచ్చని ప్రకృతి రమణీ య దృశ్యాలతో పులకిస్తోంది కోనకణ్వాశ్రమం. ఉమ్మడి జిల్లాలో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. దీనిని న్యామద్దల కోన, గుట్టూరు కోన అని కూడా పిలుస్తారు. కణ్వమహర్షి తపస్సు చేసిన స్థలం కావున కోన కణ్వాశ్రమం అనే పేరు వచ్చినట్టు పెద్దలు చెబుతుంటారు. ఈ క్షేత్రంలో ప్రముఖంగా మల్వేశ్వరస్వామి, పాం డురంగస్వామి, అయ్య ప్పస్వామి ఆంజనేయ స్వామి ఆలయాలు ఉ న్నాయి.
మొదటి రోడ్డులోని కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయంలో నిర్వహిస్తున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు సోమవారం స్వామివారు కైలాస వాహనంపై ఊరేగారు. ఆలయంలో ఉదయం మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభి షేకం, అలంకరణ, ప్రత్యేక పూజలు నిర్వహించా రు.
వ్యవసాయ శాఖ ఎంపీఈఓలకు మినిమమ్ టైం స్కేల్ వర్తింపజే సే విషయాన్ని కేబినెట్లో ప్రస్తావించి న్యాయం జరిగేలా కృషి చేస్తానని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత హామీ ఇచ్చారు. ఎంపీఈఓల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు భాస్కర్నాయక్, ఉపాధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, ఈసీ సభ్యులు తమ సమస్యలను మంత్రికి వివరించారు.