Home » Anna Canteen
ఐదేళ్ళ వైసీపీ పాలనలో సామాన్యుడు ఎన్నో కష్టాలు పడ్డాడని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. పేదవాడి ఆకలి తీర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.
ఎల్లుండి నుండి వంద అన్న క్యాంటీన్లలో ఆహారం సిద్దంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. బుధవారం గుంటూరులోని చుట్టగుంటలో అన్నక్యాంటీన్ ఏర్పాటు పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. అనంతరం అందుకు సంబంధించిన పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అమరావతి: పేదలకు కడుపునిండా రుచిగా.. శుచిగా తక్కువ ధరకు భోజనం పెట్టి కడుపు నింపే అన్న క్యాంటిన్లు మళ్లీ ప్రారంభం కాబోతున్నాయి. ఆగస్టు 15వ తేదీన రాష్ట్రంలోని వివిధ ప్రాంతంలో మొత్తం వంద క్యాంటీన్లను ప్రారంభించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం ఇప్పటికే ఏర్పాట్లు చక చక జరిగిపోతున్నాయి. హరే రామ.. హరే కృష్ణ సంస్థ భోజనం అందించే ఏర్పాట్లను చేస్తోంది.
పల్నాడు జిల్లా: సత్తెనపల్లిలో అన్న క్యాంటీన్ పనులను ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ గురువారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పేదల ఆకలి తీర్చాలని అన్న క్యాంటీన్లు పెట్టిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుదే అన్నారు. తెలుగుదేశం హయాంలో పేదలకు అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయని, అన్న క్యాంటిన్లలో ఐదు రుపాయలకే భోజనం ఏర్పాటు చేశారన్నారు.
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకెళ్తుందనే చర్చ ప్రజల్లో సాగుతోంది. ఓవైపు టీడీపీ అధికారంలోకి వస్తే ఇచ్చిన హామీలు అమలు చేయరంటూ ఎన్నికలకు ముందు వైసీపీ విస్తృతంగా ప్రచారం చేసింది.