Home » Delhi Excise Policy
లిక్కర్ స్కామ్ కేసులో సుమారు అయిదున్నర నేలల పాటు జైలులో ఉన్న కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు పలు షరతులతో శుక్రవారంనాడు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆప్ కార్యకర్తల సంబరాల మధ్య తీహార్ జైలు నుంచి సాయంత్రం ఆయన విడుదలయ్యారు. కార్యకర్తలకు అభివాదాలు తెలుపుతూనే తన స్పందన తెలియజేశారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం మనీ లాండరింగ్ వ్యవహారంలో అరెస్టయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు శుక్రవారం షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసింది. అసలు సీఎం కేజ్రీవాల్కు ఈ కేసులో ఈడీ తొలుత ఎప్పుడు సమన్లు జారీ చేసింది.. ఎప్పుడు అరెస్ట్ చేసింది.. ఎప్పుడు బెయిల్ పై విడుదలయ్యారంటే..
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో(Delhi Liquor Scam) ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) జ్యుడీషియల్ కస్టడీని సెప్టెంబర్ 25 వరకు పొడగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు నిర్ణయించింది.
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్పై దాడి కేసులో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్కు సుప్రీంకోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. ఈ అంశంపై ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ మంగళవారం స్పందించారు.
ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన ఈడీ కేసులో 'ఆమ్ ఆద్మీ పార్టీ' మాజీ ఆఫీస్ బేరర్ విజయ్ నాయర్ కు సుప్రీంకోర్టు నుంచి ఉపశమనం లభించింది. ఈ కేసులో 23 నెలలుగా తీహార్ జైలులో ఉన్న నాయర్కు అత్యున్నత న్యాయస్థానం సోమవారంనాడు బెయిల్ మంజూరు చేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు (Delhi Liquor Scam Case).. దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఢిల్లీ మొదలుకుని గల్లీ వరకూ ఎన్ని అరెస్టులు జరిగాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మరీ ముఖ్యంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇలా పెద్ద తలకాయలు అరెస్ట్ కావడంతో ఒక్కసారిగా దేశ రాజకీయాలు హీటెక్కాయి..
దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయి.. దాదాపు 5 నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తీహాడ్ జైలు నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విడుదలయ్యారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీకి సిబీఐ నమోదు చేసిన కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఎలాంటి ఊరట దక్కలేదు. కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని సెప్టెంబర్ 3న తేదీ వరకూ రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా మంగళవారంనాడు పొడిగించారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ వస్తుందో..? రాదో..? అని అరెస్టయిన మార్చి-15 నుంచి ఆగస్టు-27 వరకూ ఉన్న సస్పెన్స్కు తెరపడింది. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కవితకు బెయిల్ మంజూరు చేసింది...
సీబీఐ నమోదు చేసిన ఎక్సైజ్ పాలసీ కేసులో బెయిలు కోసం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణను సెప్టెంబర్ 5వ తేదీకి సుప్రీంకోర్టు శుక్రవారం వాయిదా వేసింది. దీంతో బెయిల్ కోసం కేజ్రీవాల్ మరికొంత కాలం వేచి చూడాల్సిన పరిస్థితి ఎదురైంది.