Home » Old age
దేశంలో ఈరోజు (ఏప్రిల్ 1, 2025) నుంచి అమలవుతున్న కొత్త ఆర్థిక సంవత్సరంలో వృద్ధులకు ఉపశమనం కలిగించే కీలక అప్డేట్ వచ్చేసింది. ఈ క్రమంలో టీడీఎస్ మినహాయింపు పరిమితి రూ. 50,000 నుంచి రూ.1,00,000 వరకు అమల్లోకి వచ్చింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
స్థానిక సర్వజనాస్పత్రిలో దివ్యాంగ పింఛన రీ వెరిఫికేషనలో బోగ్సల ఆట కట్టించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కొందరు బోగ్సలు రీవెరిఫికేషనలో బయట బయోమెట్రిక్ వేసి.. లోపలికి వైకల్యం ఉన్నవారిని పంపించి డాక్టర్లను మస్కా కొట్టించి వైకల్యం ఉన్నట్లు ఆమోదం వేయించుకుంటున్నారు. ఆర్థో, దృష్టిలోపం పరీక్షల్లో ఇలాంటి మోసాలకు పాల్పడినట్లు డాక్టర్లే గుర్తించి, అధికారులకు ఫిర్యాదులు చేశారు. ఈ వ్యవహారాలపై ‘రీ వెరిఫికేషనలో మాయగాళ్లు’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ గురువారం కథనం ప్రచురించింది. దీంతో ఉన్నతాధికారుల్లో చలనం వచ్చింది. రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులతోపాటు జిల్లా కలెక్టర్ సైతం ఈ మోసాలపై ఆరాతీసి, సీరియస్ అయినట్లు తెలిసింది. దీంతో గురువారం వైకల్య సర్టిఫికెట్ల రీవెరిఫికేషన నిర్వహిస్తున్న ఆస్పత్రి ఆవరణలో ప్రత్యేక నిఘాచర్యలు తీసుకున్నారు. తొలుత వచ్చిన వారు రిజిస్ట్రేషన చేసుకున్న తర్వాత సీరియల్ నంబర్ కేటాయిస్తారు. దాని ఆధారంగా పేరు పిలిచి, వారికి బయట బయోమెట్రిక్ తీసి లోపలికి ...
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇష్టారాజ్యంగా పింఛన్లు పంపిణీ చేశారు. అర్హత లేకపోయినా కొందరు దివ్యాంగుల పేరుతో ధ్రువపత్రాలు సంపాదించి.. ఆ మేరకు పింఛన్లు తీసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక నకిలీ పింఛన్లపై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కొందరు డీఆర్డీఏ, వైద్య సిబ్బంది వసూళ్లకు తెరలేపారు. వైద్యులతో మాట్లాడి మీ ధ్రువపత్రాలకు ఆమోదం వేయిస్తామని భారీగా డబ్బులు లాగుతున్నట్లు తెలుస్తోంది....
జిల్లాలో సోమవారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ పండుగ వాతావరణాన్ని తలపించింది. పెంచిన పింఛన అందుకున్న లబ్ధిదారుల ఇళ్లలో జయహో చంద్రన్న నినాదం మార్మోగింది. చంద్రబాబు పేదింటి పెద్ద కొడుకయ్యాడంటూ లబ్ధిదారుల నుంచి దీవెనలు వెల్లువెత్తాయి. చేతిలోకి ఒక్కసారిగా పింఛన రూపంలో రూ. ఏడు వేలు రాగానే అవ్వతాతల మోములు మతాబుళ్లా వెలిగిపోయాయి. కొందరు ఆనందంతో డ్యాన్సులు వేశారు. కొన్ని చోట్ల కేకులు కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. ..
సార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీ అధినేతగా చంద్రబాబునాయుడు ఇచ్చిన పింఛన సొమ్ము పెంపు హామీ సోమవారం నెరవేరనుంది. పెంచిన పింఛన్ల సొమ్ము పంపిణీ కార్యక్రమాన్ని పండగ వాతావరణంలో చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం 6 గంటలకే లబ్ధిదారుల ఇంటి ముంగిటకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల సొమ్ముతోపాటు ఏప్రిల్, మే, జూన మాసాలకు సంబంధించి రూ.1000 చొప్పున కలిపి మొత్తం రూ.ఏడు వేలు అవ్వాతాతలకు ఇవ్వనున్నారు. పెంచిన పింఛన్ల ...
విశాఖ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం పెన్షన్ల పంపిణీకి అదికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో విశాఖ నగరంలో సచివాలయాల వారీగా నగదు డ్రా చేసి సోమవారం కార్యదర్శులు ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేయనున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు జూలై 1న పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో స్వయంగా పాల్గొననున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలం పెనుమాకలో ఉదయం 6 గంటలకు ......
పింఛన్ల పండగకు సర్వం సిద్ధమైంది. ఇప్పటివరకు అందుతున్న రూ.3 వేలకు అదనంగా పెంచిన రూ. వెయ్యి.. గత మూడు నెలల బకాయి రూ. 3 వేలు.. మొత్తం రూ.7 వేల సొమ్ము! నిజంగానే ప్రతి లబ్ధిదారుకూ ఇది పండగే.
జిల్లావ్యాప్తంగా 12 వేల క్లస్టర్లలో పింఛన పంపిణీ మ్యాపింగ్ పూర్తి చేశామని, ఒకటో తేదీన ఇంటి వద్దనే లబ్ధిదారులకు సొమ్ము అందజేసేలా చర్యలు తీసుకుంటున్నామని డీఆర్డీఏ-వైకేపీ పీడీ ఈశ్వరయ్య తెలిపారు. తన చాంబర్లో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు పింఛన పెంచారని, పెంచిన పింఛనతో పాటు మూడు నెలల (ఏప్రిల్, మే, జూన) బాకియి మొత్తాన్ని ఒకటో తేదీన ఇంటివద్దనే అందజేస్తామని తెలిపారు. జూలై నెలకు 2,89,508 మంది లబ్ధిదారులకు రూ.197.44 కోట్లు మొత్తాన్ని జిల్లాకు ...
పెంచిన పింఛన్ల పంపిణీకి జిల్లా అధికార యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకుంటోందని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు. పింఛన్లకు కేటాయించిన సొమ్మును శనివారం బ్యాంకుల నుంచి డ్రా చేస్తామని తెలిపారు. సీఎస్ నీరబ్ కుమార్ పింఛన్ల పంపిణీపై గురువారం నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లాలో 2,87,032 మంది లబ్ధిదారులకు జూలై నెలలో పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.195.70...