Home » Peddapalli
కలిసికట్టుగా ముందుకు సాగి పార్టీ పటిష్టతకు కృషి చేయాలని బీఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. మంగళవారం మార్కండేయకాలనీలో బీఆర్ఎస్ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం నిర్వ హించారు.
రామగుండంలో జరిగిన వాహనాల కొనుగోళ్ల కుంభకోణంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఈ వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా ప్రభుత్వ పాలన వ్యవహారాలశాఖ మున్సిపల్ రీజినల్ డైరెక్టర్ మసూద్ను ఆదేశించింది. ఈ మేరకు ఆర్డీఎంఏ వరంగల్ మసూద్ సోమవారం రామ గుండం నగరపాలక సంస్థలో విచారణ జరిపారు.
ఆర్టీ సీలో రిటైరైన ఉద్యోగుల సమస్యలు పరిష్కరిం చాలని సోమవారం గోదావరిఖని ఆర్టీసీ డిపో ఎదుట రిటైర్డ్ ఉద్యోగులు ప్లకార్డులతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. రిటైర్డ్ ఎంప్లాయిస్ కో ఆర్డినేటర్లు రాజేందర్, బాణయ్య మాట్లాడుతూ రిటైర్డ్ అయిన కార్మికులకు ఏళ్ల తరబడి రావా ల్సిన బకాయిలు చెల్లించడం లేదని, పెన్షన్ కూడా సక్రమంగా ఇవ్వకుండా వేధింపులకు గురి చేస్తు న్నారని, 35సంవత్సరాలు ఆర్టీసీలో పని చేసిన తమకు రావాల్సిన బకాయిలపై యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తుందన్నారు.
సహకార సంఘాలు వ్యాపారాలు నిర్వహిస్తూ రైతుల, సంఘాల ఆర్థిక పరిపుష్టి కావాలని కేరళ రాష్ట్ర సహకార బ్యాంక్ ఉపాధ్యక్షుడు కే కన్నన్ అన్నారు. కేరళ సహకార సం ఘం పాలకవర్గం సభ్యులు, అధికారులతో కలిసి సోమ వారం సుల్తానాబాద్లోని సహకార సంఘాన్ని సందర్శిం చారు.
ఓదెల మల్లికార్జునస్వామి కల్యాణాన్ని సోమవారం పురోహితులు, అర్చకులు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, వేద పండితులు, అర్చకుల మంత్రోచ్ఛరణాల మధ్య మధ్యాహ్నం 1.19 గంటలకు కల్యాణ మహోత్సవాన్ని జరిపించారు. ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు దంపతులు పట్టు వస్త్రాలను, తలంబ్రాలను సమర్పించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ప్రక్రియను తెరపైకి తెచ్చింది. మార్చి 31వ తేదీ వరకు క్రమబద్దీకరించే వారికి 25 శాతం రాయితీ ఇస్తామని ప్రకటించింది. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనధికారిక లే అవుట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు అవకాశం ఇవ్వగా రుసుం ఎక్కువగా ఉండడంతో ఆసక్తి చూప లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం రుసుంలను సవరిస్తామని ప్రకటించింది. అయితే అందుకు సంబంధించి జారీ చేసే ఉత్తర్వులపై ఎల్ఆర్ఎస్ ఆధారపడి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్(ఆర్ఎఫ్సీఎల్)లో కొత్తగా సల్ఫర్ కోటెడ్ యూరియాను తయారు చేయనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం రోజుకు 3850టన్నుల సామర్థ్యంతో నీమ్ కోటెడ్ యూరియాను ఆర్ఎఫ్సీఎల్ ఉత్పత్తి చేస్తుంది.
ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సజా వుగా జరిగేలా అధికారులు విధులు నిర్వహించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శనివారం పెద్దపల్లిలో పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మె ల్సీ స్థానాల ఎన్నికల పోలింగ్ కేంద్రాలను కలెక్టర్, సంబంధిత అధికా రులతో పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశం లో ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 27న ఉదయం 8 నుంచి సాయం త్రం 4 గంటల వరకు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు.
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నారని టీఎన్జీఓల సంఘం రాష్ర్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ అన్నారు. శనివారం ఆయన పెద్దపల్లిలో సం ఘం నాయకులు, ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సమస్యల పరిష్కారం అవుతుం దని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్బాబు అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా శనివారం సెంటినరీకాలనీ ఐఎన్టీయుసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లా డారు.