Home » Sandhya Theatre Stampede
సినీ నటుడు అల్లు అర్జున్ ఈరోజు మరోసారి సంధ్య థియేటర్కు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పోలీసుల విచారణకు హాజరైన ఆయనను సీన్ ఆఫ్ అఫెన్స్ కోసం సంధ్య థియేటర్కు తీసుకెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అల్లు అర్జున్ ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతోంది. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతిచెందడం కలకలం రేపింది. ఈకేసులో అల్లు అర్జున్ను నిందితుడిగా చేర్చిన పోలీసులు.. తాజాగా విచారణకు హాజరుకావాలంటూ ఆయనకు నోటీసులు జారీచేశారు. దీంతో అల్లు అర్జున్ మంగళవారం చిక్కడపల్లి పోలీసుల ముందు విచారణకు హాజరుకానున్నారు.
తెలంగాణలో బెనిఫిట్షోలకు అనుమతి ఇవ్వబోమని, టికెట్ ధరల పెంపును అనుమతించబోమని చెప్పారు. తాజాగా ఏపీ, తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ నాయకులు సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.బెనిఫిట్ షోలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకూడదన్నారు. బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వబోమని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని థియేటర్స్ యాజమాన్యం స్వాగతించింది. ప్రీమియర్ షోలకు..
సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ నిర్లక్ష్యం ఉందని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశంపై శాసనసభలో మాట్లాడారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ లేవనెత్తిన ప్రశ్నకు సీఎం రేవంత్ రెడ్డి సమాధానమిస్తూ ఓ మహిళ చనిపోయిందని, థియేటర్ నుంచి నటుడు అల్లు అర్జున్ వెళ్లిపోవాలని..