Home » Siddaramaiah
ముడాకు చెందిన 14 స్థలాలను అక్రమంగా తన భార్యకు కేటాయించారనే ఆరోపణలను సిద్ధరామయ్య ఎదుర్కొంటున్నారు. లోకాయుక్త పోలీసులు చేస్తున్న విచారణను సీబీఐకి అప్పగించాలంటూ గతంలో స్నేహమయి కృష్ణ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది. దీనిపై పిటిషనర్ మరోసారి కోర్టును ఆశ్రయించారు.
ముడా భూముల కేటాయింపులో సిద్ధరామయ్య ఎలాంటి తప్పు చేయలేదని కర్ణాటక లోకాయుక్త పోలీసులు ఇటీవల క్లీన్చిట్ ఇచ్చారు. అయితే దీనిని ఈడీ, హక్కుల కార్యకర్త స్నేహమయి కృష్ణ సవాలు చేశారు. మరింత లోతుగా దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.
మార్చి 3న కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.12.57 కోట్ల బంగారంతో రన్యారావు పట్టుబడ్డారు. ఆ బంగారాన్ని సీజ్ చేసిన డీఆర్ఐ ఆ తర్వాత బెంగళూరులోని ఆమె నివాసం నుంచి మరో 2.06 కోట్ల బంగారం, 2.67 కోట్ల నగదు స్వాధీనం చేసుకుంది.
కర్ణాటక ముఖ్యమంత్రి తన అధికార నివాసాన్ని 'శీష్ మహల్' తరహాలో పునరుద్ధరించుకునేందుకు భారీగా ఖర్చు చేస్కు్న్నారంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఓవైపు ప్రజాపనుల కోసం నిధులు లేవంటూ సొంత పనులకు భారీ ఖర్చులు ఎందుకంటూ నిలదీస్తు్న్నాయి.
బీఎం పార్వతి నుంచి డవలప్మెంట్ కోసం ముడా స్వాధీనం చేసుకున్న భూములకు కొన్ని రెట్లు విలువైన భూములను ఆమె పొందారన్నది ఈ కేసులో ఉన్న ప్రధాన అభియోగం. ఖరీదైన భూములకు తన భార్యకు దక్కేలా సిద్ధరామయ్య చేశారంటూ సమాచార హ్కకు చట్టం కింద టీజే అబ్రహం, ఎస్పీ ప్రదీప్, స్నేహమయి కృష్ణ ఫిర్యాదు చేశారు.
లోకాయుక్త ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నందున లోకాయుక్త పోలీసులు సమర్ధవంతంగా విచారణ జరపలేరని పిటిషనర్ వాదించారు. లోకాయుక్త, సీబీఐ, మరే ఇతర దర్యాప్తు సంస్థతోనైనా దీనిపై దర్యాప్తు జరిపించాలని పిటిషన్ కోరారు.
సిద్ధరామయ్య ఎడమ మోకాలికి గతంలో శస్త్ర చికిత్స జరిగింది. ఇప్పుడది తిరగబెట్టిందని, దీంతో సీఎం నివాసంలో వైద్య పరీక్షల అనంతరం ఆయన ఆసుపత్రిలో చేరారని సీఎం కార్యాలయం తెలిపింది.
రెసిడెన్సియల్ లేఔట్స్ కింద మైసూరు అర్బన్ డవలప్మెంట్ అధారిటీ సీఎం సతీమణి నుంచి భూములు సేకరించి ప్రత్యామ్నాయంగా మైసూరులో విలువైన భూములు కేటాయించింది. ఆమె నుంచి సేకరించిన భూముల విలువ కంటే అత్యధిక విలువ కలిగిన భూములను ఆమెకు కేటాయించారనేది ప్రధాన వివాదం.
Chief Minister Siddaramaiah: తమ రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటా కేటాయింపుల్లో మోదీ ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తోందని సీఎం సిద్దరామయ్య మండిపడ్డారు. దేశ జీడీపీలో కర్ణాటక కీలకంగా వ్యవహరిస్తోన్న.. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు మాత్రం తగ్గిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎం మార్పు జరుగనుందంటూ వస్తున్న ఊహాగానాలపై సూర్జేవాలా సైతం స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఐక్యంగా ఉందని, సిద్ధరామయ్యే ముఖ్యమంత్రి అని తెలిపారు. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినా పార్టీ నాయకత్వం రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, సోనియాగాంధీ తీసుకుంటారని చెప్పారు.