Home » Srikakulam
రణస్థలం మండలం చిల్లపేట రాజాం పంచాయతీ బొడ్డపాడులో పురాతన శివాలయాన్ని దుండగులు బుధ వారం రాత్రికి రాత్రే నేలమట్టం చేశారు. ఈ విధ్వంసానికి పాల్పడింది ఎవరో తేల్చాలని ఆలయ పూజారి ఫణిశర్మ అధికారులను కోరారు.
దీపావళి... పండుగ అని తెలుసు. కానీ ఓ ఊరు పేరు దీపావళి అని తెలుసా. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో దీపావళి అనే గ్రామం ఉంది. అసలు ఆ పేరెలా వచ్చింది. ఊరు ప్రత్యేకత ఏంటి అనే వివరాలు తెలుసుకుందాం.
వారం రోజుల క్రితం వైసీపీ నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, అతని సన్నిహితురాలు దివ్వెల మాధురిపై తిరుమల వన్టౌన్ పోలీస్టేషన్లో కేసు నమోదైంది. ఈ నెల 7న దువ్వాడతో కలసి తిరుమల వచ్చిన ఆమె మాడవీధుల్లో, పుష్కరిణి వద్ద వీడియోలు చేస్తూ హల్చల్ చేశారు. తాము సహజీవనంలో ఉన్నామని, త్వరలో పెళ్లి చేసుకుంటామని తిరుమలలో మాధురి వ్యక్తిగత విషయాలు మాట్లాడటం వివాదాస్పదమైంది.
అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి మూలవిరాట్టును సూర్యకిరణాలు నేరుగా తాకాయి. లేలేత సూర్య కిరణాల స్పర్శతో స్వామి వారి మూలవిరాట్ దేదీప్యమానంగా వెలుగొందింది. రెండు నిమిషాలు పాటు సూర్య కిరణాలు స్వామి వారి మూల విరాట్ను తాకాయి. ఈ అద్భుత దృశ్యం భక్తులకు కనువిందు చేసింది.
ఆదిత్యుని విగ్రహంపై పడిన లేలేత కిరణాలు దర్శనమివ్వడంతో జన్మధన్యమైందంటూ భక్తులు సూర్యభగవానుడికి ప్రత్యేక పూజలు చేశారు. సూర్యకిరణాలు తాకే సమయానికి సూర్యనారాయణమూర్తిని దర్శించుకుంటే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. ఏటా రెండు సార్లు సూర్య కిరణాలు స్వామి వారి పాదాలను తాకుతాయి.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై మాజీ స్పీకర్, వైసీపీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం వివాదాస్పద వ్యాఖ్యలు వ్యాఖ్యలు. లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యిలో కల్తీ లేదని, ఆవులో కల్తీ ఉందన్నారు.
అటు ప్రధాని మోదీ, ఇటు సీఎం చంద్రబాబు ఇద్దరూ కలిసి ఏపీని అభివృద్ధి చేసేందుకు కంకణం కట్టుకున్నట్లు కేంద్ర మంత్రి చెప్పారు. ఇప్పటికే రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15వేల కోట్లు, పోలవరం మెుదటి దశ పనుల కోసం రూ.12,567కోట్లు కేంద్రం ప్రకటించిందని ఆయన తెలిపారు.
Andhrapradesh: విజయవాడలో అంత పెద్ద వరద వచ్చాక పది రోజుల్లో మళ్లీ నార్మల్ స్థాయికి తేవటం కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనితీరు వల్లే సాధ్యం అయ్యిందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ‘‘ఇది నేను కాదు.. వరదల్లో ఇబ్బందులు పడ్డ ప్రజలను ఎవరిని అడిగినా చెబుతారు’’ అని అన్నారు.
శ్రీకాకుళం జిల్లాలోని భోగాపురం ఎయిర్పోర్ట్ను మరో రెండేళ్లలో అందుబాటులోకి తీసుకువస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఇటీవల తెలిపారు.
ఉత్తరాంధ్ర జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలను వర్షాలు వణికిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి.