Home » TG News
దుబాయిలో హత్యకు గురైన ఇద్దరు తెలంగాణ వాసుల మృతదేహాలను హైదరాబాద్ తరలించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం అర్ధరాత్రి దుబాయి నుంచి బయలుదేరే ఎయిరిండియా విమానంలో మృతదేహాలను తీసుకురావాలని భావించారు.
అకాల వర్షానికి హైదరాబాద్ మహా నగరం అతలాకుతలమైంది. శుక్రవారం మధ్యాహ్నం వరకు ఎండలు తీవ్రంగానే ఉన్నా.. సాయంత్రానికి ఒక్కసారిగా కారు మబ్బులు కమ్మేసి ఉరుములు, మెరుపులతో జడి వాన కురిసింది.
పుట్టపర్తిలో జరిగే సత్యసాయిబాబా శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనే వారి కోసం తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (టీజీఎ్సఆర్టీసీ) ప్రత్యేక బస్సులు నడుపుతోంది.
ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న రోగికి చికిత్స చేసేందుకు ప్రైవేటు ఆస్పత్రి నిరాకరించగా.. ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు విక్రమ్, రంగా అజ్మీరా శస్త్రచికిత్స చేసి కాపాడిన విషయం తెలిసిందే.
స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) పోస్టుల భర్తీపై ప్రస్తుతం ప్రభుత్వం పాటిస్తున్న విధానంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టంచేసింది.
ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం అనంతరం ఓ పసికందు మృతి చెందింది. ప్రసవం ఆలస్యంగా చేయడమే పసికందు మృతికి కారణమంటూ కుటుంబ సభ్యులు శుక్రవారం ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.
గతంలో బీఆర్ఎస్ శ్రేణుల కోసమే కేసీఆర్ ధరణి చట్టాన్ని తీసుకొచ్చారని రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్సరెడ్డి అన్నారు. భూమితో సంబంధంలేని, గులాబీ చొక్కా వేసుకున్న వారికి పట్టాలు ఇచ్చి, రైతుబంధు పథకంతో లబ్ధి కలిగించారని ఆరోపించారు.
ఉద్యోగ విరమణ తర్వాత కూడా కాంట్రాక్టు పద్ధతిలో ప్రభుత్వ విభాగాల్లో ఏళ్లుగా తిష్ఠవేసిన వారిని రాష్ట్ర ప్రభుత్వం తొలగించినా విభాగాధిపతులు మాత్రం వారిలో కొందరిని తీసుకోవాలనే పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది.
హైదరాబాద్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు సంబంధించి ఎన్టీటీ డేటా, నెయిసా సంయుక్తంగా రూ.10,500 కోట్లు, విద్యుత్తు సరఫరా, పంపిణీ రంగంలో పెట్టుబడులు, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు తోషిబా కార్పొరేషన్ అనుబంధ సంస్థ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఇండియా (టీటీడీఐ) రూ.562 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నాయి.
BJP Strategy: హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకోవాలని కమలం పార్టీ హై కమాండ్ కార్యచరణ రూపొందించింది. ఈ మేరకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి ఇవాళ జరిగే సమావేశంలో పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.