తెలంగాణలో అడవులకు మహర్దశ

ABN , First Publish Date - 2021-02-05T08:50:18+05:30 IST

రాష్ట్రంలోని అడవులకు మహార్దశ వచ్చిందని మంత్రులు హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి చెప్పారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీ సంగాపూర్‌లో కల్పకవనం-అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కును గురువారం...

తెలంగాణలో అడవులకు మహర్దశ

  • సంగాపూర్‌లో పార్కును ప్రారంభించిన హరీశ్‌, ఇంద్రకరణ్‌


గజ్వేల్‌ టౌన్‌/జగదేవ్‌పూర్‌, ఫిబ్రవరి 4: రాష్ట్రంలోని అడవులకు మహార్దశ వచ్చిందని మంత్రులు హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి చెప్పారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీ సంగాపూర్‌లో  కల్పకవనం-అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కును గురువారం వారు ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషితో రాష్ట్రంలో అటవీసంపద 4 శాతం పెరిగిందని, దీంతో ప్రపంచమంతా తెలంగాణ వైపు చూస్తోందన్నారు. ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కోరుకునే పర్యాటకులకు అర్బన్‌పార్కులు ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తాయన్నారు. ఇప్పటికే 240 కోట్ల మొక్కలు నాటి, గ్రామగ్రామానికి నర్సరీ ఏర్పాటు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు.


Updated Date - 2021-02-05T08:50:18+05:30 IST