తెలంగాణలో అడవులకు మహర్దశ
ABN , First Publish Date - 2021-02-05T08:50:18+05:30 IST
రాష్ట్రంలోని అడవులకు మహార్దశ వచ్చిందని మంత్రులు హరీశ్రావు, ఇంద్రకరణ్రెడ్డి చెప్పారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ సంగాపూర్లో కల్పకవనం-అర్బన్ ఫారెస్ట్ పార్కును గురువారం...

- సంగాపూర్లో పార్కును ప్రారంభించిన హరీశ్, ఇంద్రకరణ్
గజ్వేల్ టౌన్/జగదేవ్పూర్, ఫిబ్రవరి 4: రాష్ట్రంలోని అడవులకు మహార్దశ వచ్చిందని మంత్రులు హరీశ్రావు, ఇంద్రకరణ్రెడ్డి చెప్పారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ సంగాపూర్లో కల్పకవనం-అర్బన్ ఫారెస్ట్ పార్కును గురువారం వారు ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో రాష్ట్రంలో అటవీసంపద 4 శాతం పెరిగిందని, దీంతో ప్రపంచమంతా తెలంగాణ వైపు చూస్తోందన్నారు. ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కోరుకునే పర్యాటకులకు అర్బన్పార్కులు ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తాయన్నారు. ఇప్పటికే 240 కోట్ల మొక్కలు నాటి, గ్రామగ్రామానికి నర్సరీ ఏర్పాటు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు.