ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Thulasi Reddy: ఏపీ ప్రత్యేక హోదా, విభజన హామీలను బీజేపీ తుంగలో తొక్కింది

ABN, First Publish Date - 2023-10-05T21:23:29+05:30

మోదీ పాలన నుంచి దేశాన్ని విముక్తి కల్పింద్దామని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి(Thulasi Reddy)వ్యాఖ్యానించారు. మదనపల్లిలో కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుల ర్యాలీ చేపట్టారు.

అన్నమయ్య: మోదీ పాలన నుంచి దేశాన్ని విముక్తి కల్పింద్దామని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి(Thulasi Reddy)వ్యాఖ్యానించారు. మదనపల్లిలో కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుల ర్యాలీ చేపట్టారు. జిల్లాలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగురాజు, కమిటీ అధ్యక్షుడు తులసిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా తులసిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘‘ఏపీ ప్రత్యేక హోదా, విభజన హామీలను బీజేపీ తుంగలో తొక్కింది. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఏమైంది? రాయలసీమ ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర అన్యాయం చేస్తున్నాయి. శ్రీబాగ్ ఒడంబడిక మేరకు హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయాలి. స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రానికి సీఎం జగన్ తాకట్టు పెట్టారు. పదేళ్లు బెయిల్ పైన బయట తిరుగుతున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ మాత్రమే. ఏపీ ప్రజలకు జగన్‌రెడ్డి పాలన నరకం చూపింస్తోంది’’ అని తులసిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-10-05T21:23:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising