ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Lokesh Yuvagalam: జనాలకు దగ్గరవడంలో లోకేష్ స్టైలే వేరు.. అటుగా వెళుతున్న ఆర్టీసీ బస్సెక్కి..

ABN, First Publish Date - 2023-02-15T12:15:42+05:30

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర చిత్తూరులో కొనసాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ‘‘యువగళం’’ పాదయాత్ర (Lokesh YuvaGalam Padayatra) చిత్తూరు (Chittor) జిల్లాలో కొనసాగుతోంది. స్థానిక ప్రజలు, అభిమానులు లోకేష్ పాదయాత్ర (LokeshPadayatra)కు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. పలు సామాజికవర్గాలతో, యువతతో లోకేష్ (YuvaGalama Padayatra) ముఖాముఖి నిర్వహిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. టీడీపీ (TDP) అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలను తీరుస్తానంటూ హామీ ఇస్తున్నారు. ఈరోజు ఉదయం సత్యవేడు నియోజకవర్గం పిచాటూరులో లోకేష్ పాదయాత్ర (Lokesh YuvaGalam) చేస్తున్నారు. తనకు ఎదురైన ఓ ఆర్టీసీ బస్సు (RTC Bus) ఎక్కి ప్రయాణికులను ఆప్యాయంగా పలకరించారు. బస్సులో కాసేపు ప్రయాణించిన లోకేష్... టీడీపీ ప్రభుత్వం (TDP Government) లో ఆర్టీసీ ఛార్జీలు.. వైసీపీ పాలన (YCP Government)లో ఆర్టీసీ ఛార్జీల (RTC charges) మధ్య వ్యత్యాసాన్ని ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. ఛార్జీలు పెంచి విపరీతంగా భారం పెంచారని లోకేష్‌ (NaraLokeshForPeople)కు విన్నవించారు. ప్రభుత్వం (AP Government)లో విలీనం చేసిన తరువాత సిబ్బంది పడుతున్న ఇబ్బందుల గురించి కండక్టర్‌ను యువనేత అడిగి తెలుసుకున్నారు.

ఆపై లోకేష్ మాట్లాడుతూ... వైసీపీ (YCP) ప్రభుత్వం పేదలు, మధ్యతరగతి వారు ప్రయాణించే ఆర్టీసీ ఛార్జీలను మూడు సార్లు పెంచిందని మండిపడ్డారు. జగన్ (AP CM YS Jagan) బాదుడే బాదుడుకు ప్రజలపై విపరీతమైన భారం పెరిగిందన్నారు. పెంచిన ఆర్టీసి ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంలో విలీనం చేస్తే ఆర్టీసీ కార్మికుల (RTC Employees) జీవితాలు మారిపోతాయి అన్నారని... విలీనం చేసి గాలికి వదిలేశారని విమర్శించారు. విడిగా ఉన్నప్పుడు ఉన్న లబ్ది కూడా లేక ఆర్టీసీ సిబ్బంది అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆర్టీసీ సిబ్బందికి రావాల్సిన బెనిఫిట్స్ ఏమీ కూడా ప్రభుత్వంలో విలీనం అయిన తరువాత దక్కలేదని లోకేష్ (TDP Leader Lokesh ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-02-15T12:19:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising