వైసీపీ పాలనను తరిమికొట్టేందుకు సన్నద్ధం

ABN , First Publish Date - 2023-07-09T23:40:48+05:30 IST

కోటనందూరు, జూలై 9: వైసీపీ పాలనను తరిమికొట్టేందుకు టీడీపీ కార్యకర్తలు సన్నద్ధం కావాలని తుని నియోజకవర్గ ఇన్‌చార్జి యనమల దివ్య అన్నారు. ఆదివారం పాతకొట్టాం గ్రామంలో మీఇంటికి మీదివ్య కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ వైసీపీ పాలనతో ప్రజలు విసుగెత్తిపోయారని, రానుంది టీడీపీ ప్రభుత్వేమన్నారు. మహానాడులో చంద్ర బాబు ప్రకటించిన పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. ఆ పథకాలను చూసి వైసీపీ బెంబేలెత్తుందన్నారు. గ్రామాల్లో

వైసీపీ పాలనను తరిమికొట్టేందుకు సన్నద్ధం
పాత కొట్టాంలో పర్యటిస్తున్న యనమల దివ్య

టీడీపీ తుని ఇన్‌చార్జి యనమల దివ్య

కోటనందూరు, జూలై 9: వైసీపీ పాలనను తరిమికొట్టేందుకు టీడీపీ కార్యకర్తలు సన్నద్ధం కావాలని తుని నియోజకవర్గ ఇన్‌చార్జి యనమల దివ్య అన్నారు. ఆదివారం పాతకొట్టాం గ్రామంలో మీఇంటికి మీదివ్య కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ వైసీపీ పాలనతో ప్రజలు విసుగెత్తిపోయారని, రానుంది టీడీపీ ప్రభుత్వేమన్నారు. మహానాడులో చంద్ర బాబు ప్రకటించిన పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. ఆ పథకాలను చూసి వైసీపీ బెంబేలెత్తుందన్నారు. గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి వివరింగా చెప్పాలని కోరారు. టీడీపీ రాష్ట్ర అర్గనైజింగ్‌ సెక్రటరీ యనమల కృష్ణుడు, మండలాధ్యక్షుడు గాడి రాజుబాబు, సుర్ల లోవరా జు, మోతూకూరి వెంకటేష్‌, మైనార్టీ సెల్‌ ఉపాధ్యక్షుడు షేక్‌ నవాభ్‌ జానీ, ఫేక్‌ బాబ్జి, యనమల శివరామకృష్ణన్‌, బర్ల వెంకినాయుడు, అంకంరెడ్డి రమేష్‌, సలాదిరాజు, గౌరీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-07-09T23:40:48+05:30 IST