Jada Shravan: 2019 నుంచి ఏపీలో చీకటి రోజులు
ABN, First Publish Date - 2023-09-12T21:40:21+05:30
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత చీకటి రోజులు 2019 నుంచి మొదలయ్యాయని జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపకులు జడ శ్రవణ్(Jada Shravan) వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు నారా లోకేష్(Nara Lokesh)ను కలిసి సంఘీభావం తెలిపారు.
రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత చీకటి రోజులు 2019 నుంచి మొదలయ్యాయని జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపకులు జడ శ్రవణ్(Jada Shravan) వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు నారా లోకేష్(Nara Lokesh)ను కలిసి సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన ప్రభుత్వం ప్రాథమిక హక్కులకు భంగం కలిగే విధంగా వ్యవహరిస్తోంది. వైసీపీ పార్టీకి అనుబంధంగా సీఐడీ, పోలీసులు పనిచేస్తున్నారు.నిజంగా ఒక వ్యక్తి తప్పు చేసి అరెస్ట్ అయితే తాను జైలుకి వెళ్లడానికి కూడా బాధపడడు.చంద్రబాబుకి జైల్లో పాడుకోవడానికి సరైన మంచం కూడా ఏర్పాటు చేయలేదని, తనకు ఎంతో బాధ వేస్తోందని లోకేష్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల దగ్గర నుంచి జగన్(Jagan)కు భయం పట్టుకుంది... అందుకే కుయుక్తులు పన్నుతున్నాడు.ప్రజా స్వామ్యానికి చంద్రబాబు అక్రమ అరెస్ట్ (Chandrababu arrested) మాయని మచ్చ అని జడ శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated Date - 2023-09-12T21:40:26+05:30 IST