ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Varla Ramaiah: టీడీపీ నేతలపై జగన్‌రెడ్డి తప్పుడు కేసులు బనాయిస్తున్నారు

ABN, First Publish Date - 2023-09-01T20:08:25+05:30

తెలుగుదేశం నేతలపై సీఎం జగన్‌రెడ్డి(CM Jagan Reddy) తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆ పార్టీ నేత వర్ల రామయ్య(Varla Ramaiah) మండిపడ్డారు. మాజీమంత్రి అయ్యన్నపాత్రుడి(Ayyannapatrudu) అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండించారు.

అమరావతి: తెలుగుదేశం నేతలపై సీఎం జగన్‌రెడ్డి(CM Jagan Reddy) తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆ పార్టీ నేత వర్ల రామయ్య(Varla Ramaiah) మండిపడ్డారు. మాజీమంత్రి అయ్యన్నపాత్రుడి(Ayyannapatrudu) అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండించారు. గురువారం నాడు ఆయన టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ..చంద్రబాబు, లోకేష్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కేసులు ఉండవా? అని ప్రశ్నించారు. వైసీపీ నేతలు పేర్ని నాని, కొడాలి నాని, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబులపై ఎన్ని కేసులు పెట్టాలి? అని నిలదీశారు. ఎస్సీ, బీసీలు అంటే జగన్ ప్రభుత్వానికి ఎందుకంత చులకన భావం అని అడిగారు.రెండు వర్గాల మధ్య శత్రుత్వం పెంచుతున్నారనే నెపంతో తీసుకొచ్చిన సెక్షన్ 153(A) ను వైసీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ధ్వజమెత్తారు.టీడీపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించి ఇబ్బంది పెట్టే అధికారులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.చట్టం కొందరికి చుట్టం కాకుండా చూడాల్సిన పోలీసులు ఇలా వ్యవహరించడం దుర్మార్గమని వర్ల రామయ్య మండిపడ్డారు.

Updated Date - 2023-09-01T20:08:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising