ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Gadde Rammohan : అలా చెప్పడానికి సజ్జలకు సిగ్గు లేదా?

ABN, First Publish Date - 2023-08-16T11:52:00+05:30

వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి జరిగిందని.. గతంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని చెప్పడానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి సిగ్గు లేదా అని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ప్రశ్నించారు.

విజయవాడ : వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి జరిగిందని.. గతంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని చెప్పడానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి సిగ్గు లేదా అని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ప్రశ్నించారు. కృష్ణా నది రిటైనింగ్ వాల్ గురించి సజ్జల రామకృష్ణారెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడన్నారు. వరదల నుంచి అక్కడి ప్రజలకు రక్షణ కల్పించాలని గతంలో అనేక ధర్నాలు, జల దీక్షలు చేశామన్నారు. 2014లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు కరకట్ట రిటైనింగ్ వాల్ నిర్మాణంపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

మూడు విడతలుగా 5 కిలో మీటర్లు మేర రిటైనింగ్ వాల్ నిర్మాణం చేయాలని అప్పుడే చంద్రబాబు చెప్పారని గద్దె రామ్మోహన్ అన్నారు. రిటైనింగ్ వాల్ నిర్మాణం మొత్తం తామే చేశామని సజ్జల చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. అక్కడి ప్రజలను అడిగితే ఎవరు ప్రారంభించారో చెబుతారన్నారు. అసెంబ్లీలో స్పీకర్ మా గొంతు నొక్కుతున్నారన్నారు. వాస్తవాలు చెప్పే అవకాశం కూడా ఇవ్వడం లేదన్నారు. విజయవాడను అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ అని గద్దె రామ్మోహన్ స్పష్టం చేశారు.

Updated Date - 2023-08-16T11:52:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising