ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Supreme court: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం

ABN, First Publish Date - 2023-09-25T11:10:58+05:30

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాదబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంలో రేపు(మంగళవారం) ప్రస్తావనకు రానుంది. క్వాష్ పిటీషన్‌పై రేపు ప్రస్తావించడానికి సీజేఐ డివై చంద్రచూడ్ ధర్మాసనం అనుమతి ఇచ్చింది. ఏపీ హైకోర్టు చంద్రబాబు క్వాషన్‌ను కొట్టివేయడంతో టీడీపీ అధినేత లాయర్లు సుప్రీం కోర్టుకు వెళ్లారు.

న్యూఢిల్లీ: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో (Skill Development Case) టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu) క్వాష్ పిటిషన్‌పై సుప్రీంలో (Supreme Court) కీలక నిర్ణయం తీసుకుంది. పిటిషన్ రేపు(మంగళవారం) ప్రస్తావనకు రానున్నట్టు తెలిపింది. క్వాష్ పిటిషన్‌పై రేపు ప్రస్తావించడానికి సీజేఐ డివై చంద్రచూడ్ (CJI DY Chandrachud) ధర్మాసనం అనుమతిచ్చింది.

చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు (AP Highcourt) కొట్టివేయడంతో టీడీపీ అధినేత చంద్రబాబు లాయర్లు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు కేసును సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా (Senior Council Siddharth Luthra) సుప్రీంకోర్టులో మెన్షన్ చేశారు. చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారని, అత్యవసరంగా విచారణ చేపట్టాలని లూథ్రా కోరారు. అయితే రేపు మెన్షన్ చేయాలని సీజేఐ చంద్రచూడ్ సూచించారు.

చంద్రబాబు క్వాష్ పిటీషన్‌ను అత్యవసరంగా విచారణకు స్వీకరించాలని లూథ్రా వాదించారు. ఇది ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వ్యవహారం అని... అక్కడ ప్రతిపక్షాలను అణిచివేస్తున్నారని సిద్దార్థ లూథ్రా చెప్పారు. ఎన్ని రోజుల నుంచి కస్టడీలో ఉన్నారని సీజేఐ అడుగగా.. ఈనెల 8న అరెస్టు చేశారని లూథ్రా చెప్పారు. దీంతో రేపు (మంగళవారం) మెన్షన్‌ లిస్ట్‌ ద్వారా రావాలని సీజేఐ సూచించారు. ఏపీ ప్రభుత్వం తరపున హైకోర్టులో వాదించిన ముకుల్ రోహత్గీ, సిఐడి తరపున వాదించిన రంజిత్ కుమార్‌లు కూడా సుప్రీంకోర్టుకు హాజరయ్యారు.


కాగా.. స్కిల్ డెవలప్‌మెంట్ కేసు (Skill Development Case)లో క్వాష్ పిటీషన్‌పై హైకోర్టు (High Court) తీర్పును చంద్రబాబు సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో శనివారం స్పెషల్ లీవ్ పిటీషన్‌ను లాయర్ గుంటూరు ప్రమోద్ కుమార్ దాఖలు చేశారు. దర్యాప్తు తుది దశలో ఉన్నందున జోక్యం చేసుకోలేమంటూ గత శుక్రవారం క్వాష్ పిటీషన్‌ను హైకోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే. సెక్షన్ 482 కింద దాఖలైన వ్యాజ్యంలో మినీ ట్రయల్ నిర్వహించలేమని న్యాయస్థానం పేర్కొంది. సీమెన్స్‌కు నిధుల విడుదలకు సిఫారసులతో నిధుల దుర్వినియోగమని, ఇది అస్పష్టమైన వ్యవహారమని, నిపుణులతో చర్చించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. దీంతో 17(ఏ) చంద్రబాబుకు వర్తిస్తుందని సుప్రీం కోర్టులో ఆయన తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన పిటీషన్‌లో పేర్కొన్నారు.

Updated Date - 2023-09-25T11:21:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising