Gaja : గాజా.. గజగజ
ABN , First Publish Date - 2023-10-13T03:27:43+05:30 IST
పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్-- హరాకత్ అల్-ముక్వామా అల్-ఇస్లామియా(హమాస్) పరిపాలిస్తున్న గాజా ఇప్పుడు ఇజ్రాయెల్ ముప్పేట దాడులతో

అన్నపానీయాల్లేవ్.. అంతటా చీకట్లు
బేకరీలు, దుకాణాల వద్ద జనం బారులు
హమాస్కు మరో దెబ్బ.. కీలక నేత హతం
గాజాలో గ్రౌండ్ యాక్షన్కు ఐడీఎఫ్ సిద్ధం
హమాస్ను భూస్థాపితం చేస్తాం: బెంజమిన్
జెరూసలేం, అక్టోబరు 12: పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్-- హరాకత్ అల్-ముక్వామా అల్-ఇస్లామియా(హమాస్) పరిపాలిస్తున్న గాజా ఇప్పుడు ఇజ్రాయెల్ ముప్పేట దాడులతో దిక్కుతోచని స్థితిలో ఉంది. కరెంటు లేక కకావికలమవుతోంది. అన్నపానీయాలు దొరక్క ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఏ క్షణంలో ఎక్కడి నుంచి బాంబులు పడతాయోనని గజగజ వణుకుతున్నారు. విలువైన వస్తువులు, తట్టాబుట్ట సర్దుకుని.. ఐక్యరాజ్య సమితి(ఐరాస) శిబిరాలకు తరలుతున్నారు. హమా్స-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఆరో రోజు గాజాలో కనిపించిన దృశ్యాలివి..! ఐదు రోజులుగా మూసి ఉన్న దుకాణాలు గురువారం ఉదయం కొంత సేపు తెరుచుకోగా.. ఆహార పదార్థాల కొనుగోలుకు జనాలు బారులు తీరారు. బేకరీలు, పచారీ కొట్ల వద్ద క్యూలు కట్టారు. రాబోయే రోజుల్లో యుద్ధం తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సె్స(ఐడీఎఫ్) గాజాలోకి చొచ్చుకువస్తుందనే వార్తలతో ప్రజలు ఆహార పదార్థా ల నిల్వకు ప్రయత్నాలు చేయడం వంటి వీడియోలు వైరల్ అవుతున్నాయి. పునరావాస కేంద్రం వద్ద తాకిడి విపరీతంగా ఉందని ఐరాస వర్గాలు వెల్లడించాయి. ఇజ్రాయెల్ దాడుల్లో 1,350 మంది పౌరులు చనిపోయారని, 3 లక్షల మంది నిరాశ్రయులయ్యారని పేర్కొన్నాయి. ఆరో రోజు ఇజ్రాయెల్ జరిపిన రాకెట్ దాడుల్లో హమాస్ కీలక నేత మూసా నాసిర్ హతమైనట్లు ఐడీఎఫ్ వర్గాలు వెల్లడించాయి. ‘‘మేము కేవలం గాజాలోని ఉగ్రవాద స్థావరాలనే టార్గెట్గా చేసుకున్నాం. పౌరుల ఇళ్లలోంచి ఉగ్రవాద నెట్వర్క్ ఉన్న టన్నెల్స్కు మార్గాలున్నాయి. అలాంటి వాటిని గుర్తించి, రాకెట్ దాడులు చేస్తున్నాం.
గాజాలో ని ఆస్పత్రులను టార్గెట్ చేసుకోలేదు. కరెంటు లేకు న్నా.. ఆస్పత్రుల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లున్నాయని గుర్తించాం. జనరేటర్లు పనిచేయడానికి ఇంధనం కావాలనే ఉద్దేశంతో.. గాజాలోని ఏ ఒక్క పెట్రోల్ బంకుపైనా దాడి చేయలేదు’’ అని ఐడీఎఫ్ వర్గాలు వివరించాయి. గురువారం ఒక్కరోజే గాజాపై 6 వేల రాకెట్లతో దాడులు చేశామని, 3,600 టార్గెట్లను ధ్వంసం చేశామని చెప్పాయి. హమాస్ దాడుల్లో మరణించిన పౌరుల వివరాలను గుర్తించి, వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని వెల్లడించాయి. పౌరుల బయోమెట్రిక్ డేటాబేస్ ప్రభు త్వం వద్ద ఉందని, ఆ డేటాబే్సతోపాటు.. డీఎన్ఏ ఆధారంగా మృతులను గుర్తిస్తున్నామని తెలిపాయి.
గ్రౌండ్ యాక్షన్కు సర్వం సిద్ధం
ఆరు రోజులుగా సరిహద్దులు, సముద్రం నుంచి వైమానిక, శతఘ్ని దాడులు చేస్తున్న ఇజ్రాయెల్.. గాజా ముట్టడికి గ్రౌండ్ యాక్షన్కు దిగేందుకు సిద్ధమైంది. 3.6 లక్షల రిజర్వ్ బలగాల్లో సింహభాగాన్ని గాజాస్ట్రిప్ సరిహద్దుల్లో మోహరించింది. ప్రభుత్వ ఆదేశాలే తరువాయి అని.. ఆ వెంటనే రంగంలోకి దిగి, గాజాలోని ప్రతి ఇంటినీ జల్లెడపడుతామని ఐడీఎఫ్ పేర్కొంది. అయితే.. మాయానగరం లాంటి గాజాలోని భూగర్భ సొరంగాల నెట్వర్క్ను ఛేదించడం, బందీలను విడిపించడం అంత సులభమైన పని కాదని అమెరికా నిఘా సంస్థ సీఐఏ డైరెక్టర్ లియోన్ పనెట్ట పేర్కొన్నారు. మరోవైపు.. అమెరికా రక్షణ మంత్రి ఆంటోని బ్లింకెన్ గురువారం ఇజ్రాయెల్ చేరుకున్నారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ఆయన భేటీ అయ్యారు. మరోవైపు బందీలను విడిపించేందుకు హమా్సతో చర్చలకు సిద్ధమని తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్ ప్రకటించారు.
పాలస్తీనా గుర్తింపునకు మద్దతిస్తాం: భారత్
పాలస్తీనాను సార్వభౌమాధికారం ఉన్న స్వతంత్ర దేశంగా గుర్తించే అంశానికి తాము మద్దతిస్తామని భారత్ ప్రకటించింది. గురువారం న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ మాట్లాడుతూ.. హమాస్ దాడిని ఖండిస్తూనే.. ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య శాంతి నెలకొనాలని భారత్ ఆకాంక్షిస్తోందన్నారు. అదే సమయంలో తాము ఇజ్రాయెల్కు ఆయుధాల రూపంలో సాయం చేస్తామని పేర్కొన్నారు. గాజాలో నలుగురు, పాలస్తీనా పాలిత వెస్ట్బ్యాంక్లో 12 మంది భారతీయులున్నారని.. ఇజ్రాయెల్లో చిక్కుకుపోయిన 18 వేల మంది భారతీయులను దశల వారీగా వెనక్కి రప్పిం చే ‘ఆపరేషన్ అజయ్’ ప్రారంభమైందని ఆయన వివరించారు. శుక్రవారం విమానంలో 230 మందిభారత్కు చేరుకుంటారని చెప్పారు.