ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

IND vs SA 1st Test: మైల్‌స్టోన్ రికార్డులకు చేరువలో రోహిత్, కోహ్లీ

ABN, Publish Date - Dec 26 , 2023 | 08:19 AM

దక్షిణాఫ్రికా పర్యటనలో భారత జట్టు కీలక సవాలుకు సిద్ధమైంది. ఇప్పటికే టీ20 సిరీస్‌ను సమం చేసి, వన్డే సిరీస్‌ను గెలుచుకుని ఫుల్ జోష్‌లో ఉన్న టీమిండియా నేటి నుంచి ఆరంభమయ్యే టెస్టు సిరీస్‌లోనూ సత్తా చాటాలని పట్టుదలగా ఉంది.

సెంచూరియన్: దక్షిణాఫ్రికా పర్యటనలో భారత జట్టు కీలక సవాలుకు సిద్ధమైంది. ఇప్పటికే టీ20 సిరీస్‌ను సమం చేసి, వన్డే సిరీస్‌ను గెలుచుకుని ఫుల్ జోష్‌లో ఉన్న టీమిండియా నేటి నుంచి ఆరంభమయ్యే టెస్టు సిరీస్‌లోనూ సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. వన్డే సిరీస్ గెలిచిన ఊపులో టెస్ట్ సిరీస్ కూడా గెలిచి 31 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని భావిస్తోంది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో సైతం టెస్టు సిరీస్‌లు గెలిచిన టీమిండియాకు సౌతాఫ్రికాలో మాత్రం అది అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. దీంతో ఈ సారి ఎలాగైనా టెస్టు సిరీస్ గెలిచి లోటును తీర్చుకోవాలని టీమిండియా భావిస్తోంది. ఈ క్రమంలోనే సెంచూరియన్ వేదికగా నేటి నుంచి తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుంది. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాను పలు మైలుస్టోన్ రికార్డులు ఊరిస్తున్నాయి.


96- టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో 96 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి సౌతాఫ్రికాపై 2 వేల పరుగులను పూర్తి చేసుకుంటాడు. సౌతాఫ్రికాపై రోహిత్ ఇప్పటివరకు 1904 పరుగులు చేశాడు.

66- టీమిండియా సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ తొలి టెస్టు మ్యాచ్‌లో 66 పరుగులు సాధిస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ ఏడాది 2 వేల పరుగులను పూర్తి చేసుకుంటాడు. ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలో కలిపి విరాట్ కోహ్లీ 1934 పరుగులు చేశాడు.

11- టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో ఇప్పటివరకు 489 వికెట్లు తీశాడు. మరొక 11 వికెట్లు తీస్తే 500 వికెట్ల క్లబ్‌లో చేరతాడు.

2- టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవీంద్ర జడేజా అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి ఇప్పటివరకు 548 వికెట్లు తీశాడు. మరొక 2 వికెట్లు తీస్తే 550 వికెట్లను పూర్తి చేసుకుంటాడు.

51- టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ మరొక 51 పరుగులు చేస్తే ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలో కలిపి 1000 పరుగులను పూర్తి చేసుకుంటాడు. శ్రేయాస్ ఇప్పటివరకు 949 పరుగులు చేశాడు.

34- టీమిండియా యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ మరొక 34 పరుగులు చేస్తే అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌లో 1000 పరుగులను పూర్తి చేసుకుంటాడు.

Updated Date - Dec 26 , 2023 | 08:19 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising