ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS News: కేటీఆర్‌ను స్పీకర్ నామినేషన్‌కు ఆహ్వానించిన శ్రీధర్ బాబు

ABN, First Publish Date - 2023-12-13T13:09:18+05:30

Telangana: తెలంగాణ శాసనసభ స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయానికి వెళ్లి మాజీ మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు.

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Minister Sridhar babu) బీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయానికి వెళ్లి మాజీ మంత్రి కేటీఆర్‌తో (KTR) భేటీ అయ్యారు. అనంతరం స్పీకర్ నామినేషన్ కార్యక్రమానికి కేటీఆర్‌ను శ్రీధర్‌ బాబు ఆహ్వానించారు. దీంతో మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి వెళ్లి స్పీకర్ నామినేషన్ పత్రాలపై కేటీఆర్ సంతకం చేశారు.


మరోవైపు శాసనసభకు కాంగ్రెస్‌ పార్టీ తరఫున స్పీకర్‌ అభ్యర్థిగా మాజీ మంత్రి, వికారాబాద్‌ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌ కుమార్‌ పేరును పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. కాసేపటి క్రితమే స్పీకర్ పదవికి గడ్డం ప్రసాద్ నామినేషన్ పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Updated Date - 2023-12-13T13:09:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising