ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Harish Rao: మానసిక వికలాంగుల పట్ల దుర్మార్గంగా ప్రవర్తించొద్దు

ABN, Publish Date - Dec 25 , 2023 | 03:44 PM

కొందరు మానసిక వికలాంగుల పట్ల దుర్మార్గంగా ప్రవర్తిస్తారని.. అది మంచి పద్ధతి కాదని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ( Tanniru Harish Rao ) వ్యాఖ్యానించారు. సోమవారం నాడు జిల్లా కేంద్రంలోని లయన్స్ క్లబ్‌లో అభయ జ్యోతి మనో వికాస కేంద్రం ఆధ్వర్యంలో సోలార్ సిస్టమ్, మానసిక వికలాంగులకు ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని ఎమ్మెల్యే హరీష్‌రావు ప్రారంభించారు.

సిద్దిపేట: కొందరు మానసిక వికలాంగుల పట్ల దుర్మార్గంగా ప్రవర్తిస్తారని.. అది మంచి పద్ధతి కాదని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ( Tanniru Harish Rao ) వ్యాఖ్యానించారు. సోమవారం నాడు జిల్లా కేంద్రంలోని లయన్స్ క్లబ్‌లో అభయ జ్యోతి మనో వికాస కేంద్రం ఆధ్వర్యంలో సోలార్ సిస్టమ్, మానసిక వికలాంగులకు ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని ఎమ్మెల్యే హరీష్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘‘మానసిక వికలాంగులకు ఉచిత కంప్యూటర్, సోలార్‌ను ప్రారంభించాం. మానసిక వికలాంగులకు అభయ జ్యోతి ఎంతగానో ఉపయోగ పడుతుంది. మానసిక వికలాంగులు వయస్సులో ఎంత పెద్దవాళ్లు అయిన చిన్న పిల్లలతో సమానం. దేశంలో, ఏ రాష్ట్రంలో అయిన 400, 700 కంటే ఎక్కువ పెన్షన్ ఇవ్వలేదు. గతం కేసీఆర్ ప్రభుత్వం వికలాంగులకు నాలుగు వేల పెన్షన్ ఇచ్చింది. నాలుగు వేల పెన్షన్‌ను, ఆరు వేలు ఇస్తామని చెప్పారని.. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పెన్షన్‌ను ఆరు వేల రూపాయలను పెంచి ఇవ్వాలి. మానసిక వికలాంగులకు అవసరాల కోసం నా జీతం నుంచి కొంత డబ్బులు ఇస్తాను’’ అని హరీశ్‌రావు పేర్కొన్నారు.

Updated Date - Dec 25 , 2023 | 03:45 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising