ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MLA Paritala Sunitha: రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఒక పండుగ వాతావరణం కనిపిస్తోంది

ABN, Publish Date - Jul 01 , 2024 | 09:39 AM

రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఒక పండుగ వాతావరణం కనిపిస్తోందని ఎమ్మెల్యే పరిటాల సునీత తెలిపారు. ఆత్మకూరు మండల కేంద్రంలో పండుగ వాతావరణంలో పింఛన్ల పంపిణీ జరిగింది. ఇంటింటికి వెళ్లి ఎమ్మెల్యే పరిటాల సునీత, ఎంపీ పార్థసారథి పింఛన్లు పంపిణీ చేశారు. సీఎం చంద్రబాబు చిత్రపటానికి లబ్ధిదారులతో కలిసి పాలాభిషేకం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు 7 వేల రూపాయలు అందిస్తున్నారన్నారు.

అనంతపురం: రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఒక పండుగ వాతావరణం కనిపిస్తోందని ఎమ్మెల్యే పరిటాల సునీత తెలిపారు. ఆత్మకూరు మండల కేంద్రంలో పండుగ వాతావరణంలో పింఛన్ల పంపిణీ జరిగింది. ఇంటింటికి వెళ్లి ఎమ్మెల్యే పరిటాల సునీత, ఎంపీ పార్థసారథి పింఛన్లు పంపిణీ చేశారు. సీఎం చంద్రబాబు చిత్రపటానికి లబ్ధిదారులతో కలిసి పాలాభిషేకం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు 7 వేల రూపాయలు అందిస్తున్నారన్నారు. ప్రతి ఒక్కరి కళ్లలో ఇవాళ ఆనందం కనిపిస్తోందని పరిటాల సునీత అన్నారు. 35 రూపాయల నుంచి 4000 వరకు పింఛన్లు తీసుకెళ్లింది టీడీపీ ప్రభుత్వమేనన్నారు. గత ప్రభుత్వంలో అర్హత లేకుండా చాలామంది పింఛన్ తీసుకున్నారన్నారు. అర్హత ఉన్న చాలామందికి పింఛన్లు తొలగించారన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పింఛన్ అందుతుందని పరిటాల సునీత తెలిపారు.

Updated Date - Jul 01 , 2024 | 09:39 AM

Advertising
Advertising