ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Dsp Chaitanya : డీఎస్పీ చైతన్యను ఎవరు రప్పించారు ?

ABN, Publish Date - May 23 , 2024 | 12:14 AM

అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలింగ్‌ సందర్భంగా తలెత్తిన హింసాత్మక ఘటనలను అదుపు చేసేపేరిట కడప జిల్లా రాజంపేట డీఎస్పీ చైతన్య ఎవరు రప్పించారనే కోణంలో సిట్‌ దర్యాప్తు చేస్తోంది. జిల్లాలోని పలువురు పోలీసు అధికారులను సిట్‌ సభ్యులు శ్రీనివాస్‌, భూషణం, శ్రీనివాసులు ఈ విషయమై ప్రశ్నిస్తున్నా.. స్పష్టమైన సమాధానం రావడంలేదని తెలిసింది. ఎన్నికల కమిషన ఆదేశాల మేరకు ఏర్పాటైన సిట్‌.. తాడిపత్రిలో దర్యాప్తు కొనసాగిస్తోంది. వివాదాస్పద డీఎస్పీ చైతన్య గురించి పలువురు పోలీసు అధికారులను సిట్‌ బృందం బుధవారం విచారించినట్లు సమాచారం. తాడిపత్రిలో పనిచేసే సమయంలో వైసీపీ నాయకులతో అంటకాగిన డీఎస్పీ చైతన్యను ఎన్నికల అల్లర్ల సమయంలో ఎందుకు రమ్మన్నారు? అని సూటిగా...

పోలీసు అధికారులను ప్రశ్నించిన సిట్‌

తాడిపత్రిలో కొనసాగుతున్న దర్యాప్తు

తాడిపత్రి టౌన, మే 22: అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలింగ్‌ సందర్భంగా తలెత్తిన హింసాత్మక ఘటనలను అదుపు చేసేపేరిట కడప జిల్లా రాజంపేట డీఎస్పీ చైతన్య ఎవరు రప్పించారనే కోణంలో సిట్‌ దర్యాప్తు చేస్తోంది. జిల్లాలోని పలువురు పోలీసు అధికారులను సిట్‌ సభ్యులు శ్రీనివాస్‌, భూషణం, శ్రీనివాసులు ఈ విషయమై ప్రశ్నిస్తున్నా.. స్పష్టమైన సమాధానం రావడంలేదని తెలిసింది. ఎన్నికల కమిషన ఆదేశాల మేరకు ఏర్పాటైన సిట్‌.. తాడిపత్రిలో దర్యాప్తు కొనసాగిస్తోంది. వివాదాస్పద డీఎస్పీ చైతన్య గురించి పలువురు పోలీసు అధికారులను సిట్‌ బృందం బుధవారం విచారించినట్లు సమాచారం. తాడిపత్రిలో పనిచేసే సమయంలో వైసీపీ నాయకులతో అంటకాగిన డీఎస్పీ


చైతన్యను ఎన్నికల అల్లర్ల సమయంలో ఎందుకు రమ్మన్నారు? అని సూటిగా ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. శాంతిభద్రతల పరిరక్షణ పేరిట తాడిపత్రికి ఈ నెల 14వ తేదీ అర్ధరాత్రి వచ్చిన డీఎస్పీ చైతన్య.. మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. అక్కడ ఉన్న కంప్యూటర్‌ ఆపరేటర్‌ దాసరి కిరణ్‌తోపాటు టీడీపీ కార్యకర్తలను చితకబాదారు. తాడిపత్రి గొడవలకు బాధ్యులను చేస్తూ ఎస్పీ అమిత బర్దర్‌, తాడిపత్రి డీఎస్పీ గంగయ్య, తాడిపత్రి టౌన సీఐ మురళీకృష్ణను ఎన్నికల కమిషన సస్పెండ్‌ చేసింది. కానీ డీఎస్పీ చైతన్యపై ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఆయనను రాజకీయ ప్రోద్బలంతోనే రాజంపేట నుంచి తాడిపత్రికి రప్పించారని ప్రచారం జరుగుతోంది. ఆయన వచ్చీరావడంతోనే టీడీపీ వర్గీయులను టార్గెట్‌ చేశారని విమర్శలు వచ్చాయి. ఆయన వెళ్లినపోయిన తరువాతే పరిస్థితి అదుపులోకి వచ్చిందని పలువురు చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో డీఎస్పీ చైతన్య గురించి సిట్‌ అధికారులు విచారణ చేయడం ఆసక్తికరంగా మారింది. శాంతిభద్రతల సమస్య తలెత్తడం వెనుక అడిషినల్‌ ఎస్పీ రామకృష్ణ వైఫల్యం ఉందా అనే కోణంలోనూ సిట్‌ అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలిసింది.


ఎస్‌బీ హెడ్‌ కానిస్టేబుల్‌ సస్పెన్షన

తాడిపత్రిలో గొడవలకు సంబంధించి ముందస్తు సమాచారం ఇవ్వడంలో విఫలమైనందుకు ఎస్‌బీ హెడ్‌కానిస్టేబుల్‌ ఈశ్వర్‌ రెడ్డిని సస్పెండ్‌ చేస్తూ ఆ శాఖ ఉన్నతాధికారులు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, ఆ రెండు రోజులూ అక్కడి పరిస్థితులను అధికారులకు ఈశ్వర్‌ రెడ్డి చేరవేశారని, ఎవరో నిర్లక్ష్యానికి మరెవరినో బలిపశువును చేశారని సొంత శాఖ నుంచే విమర్శలు వస్తున్నాయి. సిట్‌ దర్యాప్తు నేపథ్యంలో శాఖాపరంగా ఎవరో ఒకరిపై చర్యలు తీసుకోవాలన్న ఉద్దేశంతో కిందిస్థాయి సిబ్బందిని బలిపశువులను చేస్తున్నారన్న చర్చ పోలీసు శాఖలో నడుస్తోంది. మరికొందరిపైనా చర్యలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. దీంతో తమ తప్పు లేకపోయినా బలి తీసుకుంటారేమోనని కిందిస్థాయి సిబ్బందిలో పలువురు ఆందోళన చెందుతున్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 23 , 2024 | 12:14 AM

Advertising
Advertising