ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

YS Sharmila: సీకే కన్వెన్షన్ సెంటర్‌లో వైఎస్ఆర్ జయంతి..

ABN, Publish Date - Jul 02 , 2024 | 07:39 PM

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతిని భారీ ఎత్తున నిర్వహించాలని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు, ఆయన కుమార్తె వైఎస్ షర్మిల నిర్ణయించారు. ఆ క్రమంలో వైఎస్ఆర్ జయంతి.. జులై 08వ తేదీన తాడేపల్లిలోని సీకే కన్వెన్షన్ సెంటర్‌ వేదికగా నిర్వహించేందుకు ఆమె అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

AP PCC Chief YS Sharmila

అమరావతి, జులై 02: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతిని భారీ ఎత్తున నిర్వహించాలని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు, ఆయన కుమార్తె వైఎస్ షర్మిల నిర్ణయించారు. ఆ క్రమంలో వైఎస్ఆర్ జయంతి.. జులై 08వ తేదీన తాడేపల్లిలోని సీకే కన్వెన్షన్ సెంటర్‌ వేదికగా నిర్వహించేందుకు ఆమె అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున హాజరు కావాలని వైఎస్ఆర్ అభిమానులకు ఈ సందర్భంగా ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమం నిర్వహించడం తాను గొప్ప వరంగా భావిస్తున్నానని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.


వైఎస్ఆర్ జయంతి సందర్బంగా నిర్వహిస్తున్న ఈ సభకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీ‌, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తోపాటు ఆ పార్టీలోని కీలక నేతలు హాజరుకానున్నారు. అలాగే తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సైతం హాజరుకానున్నారు. అయితే మంగళవారం హైదరాబాద్‌లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్కమార్క నివాసాలకు స్వయంగా వెళ్లి వారిని వైఎస్ షర్మిల ఆహ్వానించిన సంగతి తెలిసిందే.

Also Read: AP Politics: సీఎం రేవంత్‌తో వైఎస్ షర్మిల భేటీ.. స్కెచ్‌లో భాగమేనా?

Also Read: West Bengal: చోప్రా వీడియో ఘటనలో కీలక మలుపు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 02 , 2024 | 07:39 PM

Advertising
Advertising