ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Politics: రాజధాని అమరావతి, పోలవరం నిర్మాణం త్వరితగతిన పూర్తవ్వాలని శ్రీవారిని కోరా: నటుడు శివాజీ

ABN, Publish Date - Jun 07 , 2024 | 10:37 AM

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి (Kutami) 164స్థానాల్లో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కానున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచీ చంద్రబాబు (Chandrababu), పవన్ కల్యాణ్‌కు పెద్దఎత్తున అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

తిరుమల: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి (Kutami) 164స్థానాల్లో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కానున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచీ చంద్రబాబు (Chandrababu), పవన్ కల్యాణ్‌కు పెద్దఎత్తున అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియా, దేశవిదేశాలల్లో సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. పలువురు సినీ, వివిధ రంగాల ప్రముఖులు సైతం శుభాకాంక్షలు తెలిపారు.


తాజాగా రాజధాని అమరావతి (Amaravathi), పోలవరం నిర్మాణం త్వరితగతిన పూర్తవ్వాలని నటుడు శివాజీ(Actor Shivaji) ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీలో స్వర్ణయుగం ప్రారంభం అయ్యిందని పేర్కొన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ నాయకత్వంలో ఏపీ అభివృద్ధి పథంలో దూసుకుపోనున్నట్లు ఆయన తెలిపారు. ఐదేళ్లుగా ఏపీ అభివృద్ధికి నోచుకోలేదని, రాజధాని లేని రాష్ట్రంగా మారిపోయిందన్నారు. చంద్రబాబు హయాంలో అమరావతిలో అభివృద్ధి పరుగులు పెట్టనున్నట్లు చెప్పారు. తిరుమల శ్రీవారి వద్ద నాటకాలు ఆడితే ఎవరికైనా ఇలానే శిక్ష పడుతుందని వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి అన్నారు.

Updated Date - Jun 07 , 2024 | 10:39 AM

Advertising
Advertising