ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Nara Lokesh: డయాలసిస్‌ సెంటర్‌‌ను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్

ABN, Publish Date - Sep 20 , 2024 | 01:27 PM

వైసీపీ అధికారంలోకి వస్తే దశల వారీగా సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తామని జగన్ అన్నారని, అది అమలు చేయకపోగా.. రాజారెడ్డి రాజ్యాంగం తీసుకొచ్చి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని మంత్రి లోకేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రశ్నించిన వారిపై దొంగ కేసులు పెట్టారని, జైల్లో పెట్టించారని విమర్శించారు. తనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సహా 23 కేసులు పెట్టారని, ఫేక్‌ జగన్‌ చెప్పేవన్నీ అబద్ధాలేనని దుయ్యబట్టారు.

చిత్తూరు: జిల్లాలోని బంగారుపాళ్యంలో మంత్రి నారా లోకేశ్ (Minister Nara Lokesh) పర్యటిస్తున్నారు. యువగళంలో ఇచ్చిన హామీ ప్రకారం ఇవాళ (శుక్రవారం) కిడ్నీ డయాలసిస్‌ సెంటర్‌‌ను (Dialysis Center)‌ ఆయన ప్రారంభించారు. సెంటర్‌ను పరిశీలించిన లోకేష్.. రోగులతో మాట్లాడారు. అలాగే 30 పడకల ఆస్పత్రిని, ఆవరణలో రక్తదాన శిబిరాన్ని (Blood Donation Camp) ప్రారంభించారు. అనంతరం ఆస్పత్రి ఆవరణలో మంత్రి నారా లోకేష్‌ మొక్కలు నాటారు.

హాస్పిటల్‌లో కార్యక్రమాలు ముగిసిన అనంతరం బంగారుపాళ్యంలో లోకేష్‌ 'ప్రజా దర్బార్‌' నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. యువగళం పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చామని స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లాను సమగ్రంగా అభివృద్ధి చేసి రుణం తీర్చుకుంటానని ఆయన అన్నారు. యువగళాన్ని అడ్డుకునేందుకు గత ప్రభుత్వం యత్నించిందని, కుట్రను ఛేదించుకుంటూ యువగళం యాత్ర సాగిందని లోకేశ్ ప్రస్తావించారు.


వైసీపీ అధికారంలోకి వస్తే దశల వారీగా సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తామని జగన్ అన్నారని, అది అమలు చేయకపోగా.. రాజారెడ్డి రాజ్యాంగం తీసుకొచ్చి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని మంత్రి లోకేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రశ్నించిన వారిపై దొంగ కేసులు పెట్టారని, జైల్లో పెట్టించారని విమర్శించారు. తనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సహా 23 కేసులు పెట్టారని, ఫేక్‌ జగన్‌ చెప్పేవన్నీ అబద్ధాలేనని దుయ్యబట్టారు. పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లను రద్దు చేశారని, అడుగడుగునా జగన్‌ కుట్రలు పన్నుతున్నారని అన్నారు. తిరుమల లడ్డూలో కూడా నాణ్యత లేకుండా చేశారని లోకేష్‌ మండిపడ్డారు.


టీటీడీ మాజీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డికి మంత్రి లోకేష్‌ సవాల్‌ చేశారు. లడ్డూ నాణ్యతపై ప్రమాణం చేసేందుకు సుబ్బారెడ్డి సిద్ధమా? అని ప్రశ్నించారు. లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారని తెలిసి షాక్‌ అయ్యానన్నారు. లడ్డూ తయారీ నెయ్యిని కల్తీ చేశారని నివేదికలు వచ్చాయని, దేవుడి దగ్గర కూడా రాజకీయాలు చేశారని.. వ్యవస్థలను పూర్తిగా నాశనం చేశారని లోకేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సామాజిక పెన్షన్లను ఒకేసారి రూ.4 వేలకు పెంచామని, రాష్ట్రానికి పెట్టుబడులతో పాటు పరిశ్రమలను తీసుకొస్తున్నామన్నారు. ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ను రద్దు చేశామని మంత్రి లోకేష్‌ స్పష్టం చేశారు. కాగా చిత్తూరు జిల్లాలో పర్యటించిన మంత్రికి గ్రామస్థులు తమ బాధలను వివరించారు. అనేక మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నట్లు వాపోయారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే సెంటర్లను ఏర్పాటు చేసి ప్రారంభిస్తున్నామన్నారు. దీంతో లోకేష్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.


ఈ కార్యక్రమం అనంతరం మంత్రి లోకేశ్.. మంత్రి సత్యకుమార్‌తో కలిసి నల్లగాడు కోటూరు గ్రామానికి బయలుదేరారు. అక్కడ ఏర్పాటు చేసిన ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం స్థానిక ప్రభుత్వ పాఠశాలను సందర్శిస్తారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడి విద్య అందుతున్న తీరు, మౌలిక వసతులు వంటి అంశాలపై ఆరా తీయనున్నారు. మధ్యాహ్నం 3గంటలకు పర్యటన ముగించుకుని తిరిగి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం అక్కడ్నుంచి విజయవాడకు బయలుదేరతారు.


ఈ వార్తలు కూడా చదవండి..

విడదల రజినిపై విచారణకు ఆదేశం

చిత్తూరు జిల్లాలో మంత్రి లోకేష్ పర్యటన.. (ఫోటో గ్యాలరీ)

ఐపీఎస్ పాసింగ్ ఔట్ పెరేడ్ (ఫోటో గ్యాలరీ)

తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Sep 20 , 2024 | 01:44 PM