ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Amaravati : పింఛన్ల పంపిణీకి చంద్రబాబు హాజరు

ABN, Publish Date - Jun 30 , 2024 | 03:10 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు జూలై 1న పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో స్వయంగా పాల్గొననున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలం పెనుమాకలో ఉదయం 6 గంటలకు ......

అమరావతి(ఆంధ్రజ్యోతి)/తాడేపల్లి టౌన్‌, జూన్‌ 29: ముఖ్యమంత్రి చంద్రబాబు జూలై 1న పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో స్వయంగా పాల్గొననున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలం పెనుమాకలో ఉదయం 6 గంటలకు ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం నిర్వహించే ప్రజావేదిక కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులు, ప్రజలతో సీఎం ముచ్చటిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 65.18 లక్షల మంది లబ్ధిదారులకు రూ.4,408 కోట్ల పింఛన్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా స్వయంగా సీఎం ఒక గ్రామంలోని ఇళ్లకు వెళ్లి పింఛన్లు ఇవ్వడం చరిత్రలో ఇదే మొదటిసారి కానుంది.. రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం ఈ కార్యక్రమంలో భాగస్వాములు కానున్నారు. కలెక్టర్‌ నాగలక్ష్మి, మున్సిపల్‌ కమిషనర్‌ నిర్మల్‌కుమార్‌, డిప్యూటీ కమిషనర్‌ శివారెడ్డి తదితరులు గ్రామంలో ఏర్పాట్లను పరిశీలించారు.

Updated Date - Jun 30 , 2024 | 03:10 AM

Advertising
Advertising