ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Volunteers Resign: రాజీనామా చేసి తప్పు చేశామా.. తలలు పట్టుకుంటున్న వలంటీర్లు.. వాళ్లకు మాత్రం జాక్‌పాట్!

ABN, Publish Date - May 21 , 2024 | 12:07 PM

ఐదేళ్ల పాటు వీరితో పనులు చేయించుకున్న సర్కార్‌.. ఎన్నికల సమయం రాగానే రాజీనామాలు చేయించేందుకు అధికార పార్టీ నేతలు ఒత్తిడి తెచ్చారు. ఇలా రాజీనామా చేసిన వారినే, మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత వలంటీర్లుగా గుర్తిస్తామని మభ్యపెట్టింది. ప్రభుత్వం నుంచి వేతనం ఇస్తూ.. పార్టీకి సేవలందించాలనే తీరులో వీరి వ్యవహారం సాగింది.

AP Volunteers

  • ఇప్పుడేం చేద్దాం..!

  • రాజీనామా చేసి తప్పు చేశామా?

  • మాజీ వలంటీర్ల కుంగుబాటు

  • కూటమి ప్రభుత్వం వస్తుందని బలంగా ప్రచారం

  • రాజీనామా చేయని వారికి యథావిధిగా వే తనం

  • వచ్చే ప్రభుత్వంలో పది వేల వేతనంతో జాక్‌పాట్‌

ఏలూరు జిల్లా, ఆంధ్రజ్యోతి: వైసీపీ (YSRCP) ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి 50 కుటుంబాలకు ఒకరు చొప్పున రూ.5 వేలు వేతనంతో జిల్లాలో 9,732 మంది వలంటీర్లను నియమింంది. నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉండడంతో ఎంతో మంది యువకులు వీటిపై ఆసక్తి కనబరిచారు. 605 సచివాలయాల్లో వీరు విధులు నిర్వహించేవారు. ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు చేర్చడం, రేషన్‌ పంపిణీ వంటి విధులను కేటాయించారు. ప్రజలతో మమేకమైన వలంటీర్లను ఎన్నికల్లో వినియోగించుకోవడానికి వీలుగా సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర వంటి పురస్కారాలను ప్రభుత్వం ప్రకటించింది. ప్రతిపక్షాల ఫిర్యాదుతో ఎన్ని కల కమిషన్‌ వలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంంది. ఐదేళ్ల పాటు వీరితో పనులు చేయించుకున్న సర్కార్‌.. ఎన్నికల సమయం రాగానే రాజీనామాలు చేయించేందుకు అధికార పార్టీ నేతలు ఒత్తిడి తెచ్చారు. ఇలా రాజీనామా చేసిన వారినే, మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత వలంటీర్లుగా గుర్తిస్తామని మభ్యపెట్టింది. ప్రభుత్వం నుంచి వేతనం ఇస్తూ.. పార్టీకి సేవలందించాలనే తీరులో వీరి వ్యవహారం సాగింది.

AP Elections: రాజీనామా తర్వాత వలంటీర్లు ఏం చేస్తున్నారో తెలిస్తే..?



వాట్ నెక్స్ట్!

నియోజకవర్గ నేతల ఒత్తిడి, పెట్టిన ఇబ్బందుల కారణంగా జిల్లాలో 1,500 మంది బలవంతంగా రాజీనామాలు చేశారు. ఇలా రాజీనామాలు చేసిన వీరికి ప్రభుత్వం వేతనం ఇవ్వ లేదు. నేతలు కొద్దిపాటి సొమ్ముతో సరిపెట్టారు. ఒక్కొక్క వలంటీరుకు ఐదు వేలు చొప్పున ఇచ్చి ప్రచారంలో వారి సేవలను వినియోగించుకు న్నారు. రాజీనామా చేయని వలంటీర్లకు మాత్రం ప్రభుత్వం గత నెలతోపాటు, ఈ నెల వేతనం ఇచ్చిం ది. పది వేలు లబ్ధి పొందారు. ముందు ముందు ప్రభుత్వం వారి సేవలు కొనసాగించనుంది. తెలుగుదేశం పార్టీ కూటమి మేనిఫెస్టోలో వలంటీర్లకు పది వేలు వేతనం ఇస్తామంటూ ప్రకటించింది. దీంతో వీరు పునరాలోచనలో పడ్డారు. ఎంత ఒత్తిడి చేసినా సరే ఐదు వేల మంది వలంటీర్లు రాజీనామాకు ససేమిరా అన్నారు. ప్రభుత్వం మారితే రాజీనామా చేయని వలంటీర్లు మాత్రం యధావిధిగా కొనసాగుతారు. వారికి పది వేల గౌరవ వేతనం లభిస్తుంది. మరోవైపు ప్రభుత్వ పోత్సాహకాలు ఉంటాయి.

రాకపోతే ఏం చేయాలి..?

వలంటీర్లు.. ప్రజలకు ఐదేళ్ళుగా సేవలందించారు. అధికార పార్టీ ఒత్తిడికి గురై వేలాది మంది రాజీనామాలు చేశారు. ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు. ఇలాంటి వీరంతా ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. రాజీనామా చేసి తప్పు చేశామంటూ మదన పడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం తిరిగి రాకపోతే తమ పరిస్థితి ఏమిటోనంటూ ఆందోళన చెందుతున్నారు.


ప్రభుత్వం మారితే కష్టమే !

రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోతుందన్న సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. కూటమిలో జోష్‌ నెలకొంది. కూటమి అభ్యర్థులకు ముందస్తు శుభాకాంక్షలు తెలుపు తున్నారు. వైసీపీ అభ్యర్థుల శిబిరాలు వెలవెలబోతున్నాయి. అభ్యర్థులను కలిసే నేతలు కరువయ్యారు. అంతా ముఖం చాటేస్తున్నారు. ఎన్నికల రోజున కార్యకర్తలు కూడా పోలింగ్‌ స్టేషన్ల వద్ద కానరాలేదు. ప్రచారం నిర్వహించలేదు. అభ్యర్థులు వలంటీర్లపైనే ఆధారపడాల్సి వచ్చింది. వీరు లేకపోతే ఎన్నికలే లేవంటూ వైసీపీ అభ్యర్థులు వాఖ్యానిస్తున్నారంటే ఆ పార్టీకి కార్యకర్తల లోటు ఎంతగా ఉందో అర్ధమవుతుంది. వైసీపీ కార్యకర్త లను వదిలేసి మమ్మల్ని బలి చేసిదంటూ వలంటీర్లు మదనపడుతున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు కుమిలిపోతున్నారు. రెండు నెలలపాటు వలంటీర్ల సేవలను వినియోగించుకోని ప్రభుత్వం జూన్‌లో మళ్లీ వారిని తెరపైకి తేనుంది. రెండు నెలలపాటు పెన్షన్‌లు ఇవ్వడంలోనూ ప్రభుత్వం దొంగబుద్ధి చూపింది. ఇంటింటికి పెన్షన్‌ ఇవ్వకుండా వృద్ధులను వేధించింది. జూన్‌లో ఆ బాధ తొలగిపోయే అవకాశం ఉంది. రాజీనామా చేయని వలంటీర్లకు ఇప్పటికే వేతనం ఇస్తోంది. దీంతో జూన్‌ పెన్షన్‌లను అందుబాటులో వున్న వలంటీర్ల ద్వారా ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. రాజీనామా చేసిన వలంటీర్లను కుంగదీస్తుంది.

Read Latest AP News and Telugu News


Updated Date - May 21 , 2024 | 12:14 PM

Advertising
Advertising