ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Chandrababu Naidu: మారిన చంద్రబాబును చూస్తారు

ABN, Publish Date - May 16 , 2024 | 04:31 AM

తెలుగుదేశం కూటమి కోసం ప్రచారం చేయడానికి రాష్ట్రానికి వచ్చిన ప్రవాసాంధ్రులకు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ‘మీ కృషి ఎనలేనిది’ అని కొనియాడారు. ఇక ముందు తనలో పూర్తిగా మారిన చంద్రబాబును చూస్తార ని

Chandrababu

  • సీఎంగా బాధ్యతలు చేపట్టాక ప్రవాసాంధ్రులతో భేటీకి ప్రత్యేక విధానం

  • పార్టీకి ప్రచారం చేసిన వారికి కృతజ్ఞతలు

  • ప్రవాసాంధ్రులతో బాబు వీడియో కాల్‌

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి/అమరావతి): తెలుగుదేశం కూటమి కోసం ప్రచారం చేయడానికి రాష్ట్రానికి వచ్చిన ప్రవాసాంధ్రులకు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ‘మీ కృషి ఎనలేనిది’ అని కొనియాడారు. ఇక ముందు తనలో పూర్తిగా మారిన చంద్రబాబును చూస్తార ని వ్యాఖ్యానించారు. పార్టీపై అభిమానంతో ప్రచా రం చేసిన ప్రవాసాంధ్రులు ఎన్నికల అనంతరం విదేశాలకు వెళ్లే ముందు మంగళవారం రాత్రి మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా వారి గౌరవార్థం ఎన్‌ఆర్‌ఐ గ్రాట్యుటీ డిన్నర్‌ ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చంద్రబాబు వీడియో కాల్‌లో మాట్లాడారు.

మాతృభూమిపై మమకారంతో సప్త సముద్రాలు దాటి వచ్చి పార్టీ కోసం పని చేశారని కొనియాడారు. ముఖ్యమంత్రిగా తాను బాధ్యతలు స్వీకరించిన తర్వాత విదేశాల నుంచి వచ్చిన ప్రవాసాంధ్రులు తనను కలుసుకోవడానికి ప్రత్యేక విధానాన్ని ప్రవేశపెడతానన్నారు. విదేశాలలోని ప్రవాసాంధ్రులు ప్రతి ఒక్కరు తమ వంతుగా సంవత్సరానికి ఐదుగురు యువకులకు ఉద్యోగాలు కల్పిం చి, వీసా ఇప్పించడానికి ముందుకు రావడం కీలక అధ్యాయమని ప్రశంసించారు.


గడచిన ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఎన్‌ఆర్‌ఐల గురించి పట్టించుకోకపోవడంతో వారి ద్వారా రాష్ట్రానికి వచ్చే పరిశ్రమ లు ఆగిపోయాయన్నారు. గల్ఫ్‌ దేశాల్లోని ఎన్‌ఆర్‌ఐలు ప్రమాదం బారిన పడితే రూ.ఒక లక్ష, ప్రమాదవశాత్తు చనిపోతే రూ.10 లక్షలు, అక్కడ వారికి ఏదైనా న్యాయ సమస్యలు తలెత్తితే రూ.50 వేల వరకు అందేలా ఆనాడు టీడీపీ ప్రభుత్వం ప లు కార్యక్రమాలు చేపట్టిందని గుర్తు చేశారు. నాడు టీడీపీ ప్రభుత్వం ఎన్‌ఆర్‌ఐల కోసం చేపట్టిన కార్యక్రమాలను వైసీపీ ప్రభత్వం రద్దు చేసిందని, ఎన్డీయే కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే వాటన్నింటినీ పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు.

ఏపీ భవిష్యత్తు కోసమే తాము కుటుంబసభ్యులతో సహా స్వచ్ఛందంగా తరలివచ్చి ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నామని పలువురు ఎన్‌ఆర్‌ఐలు తెలిపారు. చంద్రబాబు అధికారంలోకి వస్తేనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని, కూటమి గెలుపు ఏపీకి మలుపు కాబోతుందని వ్యాఖ్యానించారు. పార్టీ గల్ఫ్‌ విభాగం అధ్యక్షుడు రావి రాధాకృష్ణ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ప్రచా రం చేసిన తీరును ఎన్నారై విభాగం అధ్యక్షుడు వేమూరి రవి వివరించారు. వాస్తవానికి వీరందరికీ విందు ఏర్పాటు చేసి చంద్రబాబు స్వయానా కలవాల్సి ఉంది. వారాణసీలో ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్‌ కార్యక్రమానికి వెళ్లిన ఆయన తిరిగి రావడంలో ఆలస్యం కావడంతో ఈ సమావేశానికి రాలేకపోయినట్టు రాధాకృష్ణ తెలిపారు. ఈ సమావేశంలో గుంటూరు లోక్‌సభ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌తో పాటు పార్టీ ప్రవాసీ ప్రముఖులు కోమటి జయరాం, వెంకట్‌ కోడూరి, సురేశ్‌ మాలపాటి, మల్లిక్‌ మేడరమట్ల పాల్గొన్నారు.


రోడ్డు ప్రమాదంపై బాబు దిగ్భ్రాంతి..

పల్నాడు జిల్లా పసుమర్రు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై చంద్రబాబు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతిచెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. కాగా, సర్‌ ఆర్ధర్‌ కాటన్‌ కాటన్‌ జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి చంద్రబాబు నివాళులర్పించారు.

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - May 16 , 2024 | 10:58 AM

Advertising
Advertising