ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AR Dairy: తిరుమల లడ్డూ కల్తీ వివాదం.. హైకోర్టును ఆశ్రయించిన ఏఆర్ డెయిరీ ఎండీ..

ABN, Publish Date - Sep 30 , 2024 | 07:55 PM

తిరుమల లడ్డూ వివాదంలో ముందస్తు బెయిల్ కోరుతూ ఏఆర్ డెయిరీ ఎండీ రాజశేఖరన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. కల్తీ నెయ్యి సరఫరా చేశారని టీటీడీ ఇచ్చిన ఫిర్యాదుతో తిరుపతిలో ఏఆర్ డెయిరీపై కేసు నమోదు అయ్యింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు.

అమరావతి: తిరుమల లడ్డూ వివాదం మరో కీలక మలుపు తిరిగింది. శ్రీవారి ప్రసాదం కల్తీ వివాదంలో ముందస్తు బెయిల్ కోరుతూ ఏఆర్ డెయిరీ ఎండీ రాజశేఖరన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. కల్తీ నెయ్యి సరఫరా చేశారని టీటీడీ ఇచ్చిన ఫిర్యాదుతో తిరుపతిలో ఏఆర్ డెయిరీపై కేసు నమోదు అయ్యింది. దీంతో తన అరెస్టుతోపాటు ఎటువంటి తొందరపాటు చర్యలూ తీసుకోవద్దని ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. నెయ్యి శాంపిల్స్ సేకరణ, దాన్ని విశ్లేషించడంలో అధికారులు ఫుడ్ సెఫ్టీ అండ్ స్టాండెడ్స్ అథారిటీ చట్ట నిబంధనలు అనుసరించలేదని ఎండీ రాజశేఖరన్ పిటిషన్‌లో పేర్కొన్నారు.


నేతి కల్తీ ఆరోపణలపై తన నుంచి ఎలాంటి వివరణ తీసుకోకుండానే కేసు పెట్టడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని ఆయన కోర్టుకు తెలిపారు. తనపై చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలూ లేవని, రాజకీయ కారణాలతోనే కేసు పెట్టారని ఏఆర్ డెయిరీ ఎండీ ఆరోపించారు. తనను పోలీసులు అరెస్టు చేస్తే పూడ్చుకోలేని నష్టం జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ముందస్తు బెయిల్ మంజూరుకు ఎలాంటి షరత్తులు విధించినా కట్టుబడి ఉంటానని ఆయన పేర్కొన్నారు. రాజశేఖరన్ వేసిన పిటిషన్ హైకోర్టులో రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది.


లడ్డూ వివాదం.. సుప్రీంకోర్టు స్పందన..

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంపై ఇవాళ(సోమవారం) సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కల్తీ నెయ్యి వాడకం వివాదంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఘాటుగా స్పందించింది. దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలని హితవుపలికింది. లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వినియోగించారనడానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని ప్రభుత్వం తరపున న్యాయవాది ముకుల్ రోహత్గీని జస్టిస్ బి.ఆర్. గవాయ్, జస్టిస్ కేవీ బాలకృష్ణన్ ధర్మాసనం ప్రశ్నించింది. కల్తీ నెయ్యి వాడారో లేదో పూర్తిగా తెలియకుండా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఎలా ప్రకటన చేస్తారని సుప్రీంకోర్టు నిలదీసింది. ఈ అంశంపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) నియమించిన అనంతరం కల్తీ నెయ్యిపై మీడియా ముందు ప్రకటన చేయడంపై ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో కొత్తగా నియమించిన సిట్ సరిగ్గా విచారణ జరపగలదా? అన్న సందేహాలు ఉన్నాయని న్యాయస్థానం పేర్కొంది.


స్వామివారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యిని వినియోగించినట్లు ఎలా తెలిసిందంటూ సుప్రీంకోర్టు సందేహం వ్యక్తం చేసింది. అలాగే స్వామి వారి ప్రసాదం లడ్డూని పరీక్షల కోసం ల్యాబ్‌కి ఎప్పుడు పంపారని ముకుల్ రోహాత్గిని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం విచారణ జరిపితే బావుంటుందని ధర్మాసనం అభిప్రాయపడింది. అనంతరం ఈ కేసు విచారణను జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ బాలకృష్ణన్ ధర్మాసనం గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తిరుమల లడ్డూ వివాదంపై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. తిరుమల స్వామి వారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించినట్లు ఆరోపణలు నేపథ్యంలో ఈ అంశంలో నిజం నిగ్గూ తేల్చాలంటూ బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి, వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి వేర్వేరుగా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.


గత ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించినట్లు ఎన్‌డీడీబీ నివేదిక స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘోర అపచారం జరిగిన నేపథ్యంలో శ్రీవారి ఆలయంలో శాంతి హోమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించింది. అలాగే సంప్రోక్షణ కార్యక్రమాన్ని సైతం చేపట్టింది. అందులోభాగంగా ఆనంద నిలయంతో పాటు తిరుమల మాఢవీధుల్లో సైతం సంప్రోక్షణ నిర్వహించింది. మరోవైపు తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారాన్ని ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరపాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. గుంటూరు ఐజీ సర్వ శ్రేష్టి త్రిపాఠి నేతృత్వంలో సిట్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో శనివారం సిట్ బృందం తిరుమల చేరుకుని.. తన దర్యాప్తును ప్రారంభించింది.

ఇవి కూడా చదవండి...

BT Naidu: పారిశ్రామిక రంగం పునరుజ్జీవనం చంద్రబాబు పాలనలోనే..

Pawan Kalyan: ఆ పాటను ఎవరూ మరిచిపోలేరు.. మిథున్‌కు అభినందనలు

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 30 , 2024 | 08:01 PM