ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TDP: టీడీపీ ఆఫీసులోకి దూరి సీనియర్ నేతపై కానిస్టేబుల్ దాడి..!

ABN, Publish Date - Jul 07 , 2024 | 09:48 AM

సాక్షాత్తు టీడీపీ కార్యాలయంలో సీనియర్‌ నేతపైనే దాడి చేయడం దేనికి సంకేతమని ప్రజల్లో జోరుగా చర్చ సాగుతోంది. సామాజికంగా, ఆర్థికంగా బలమైన..

గుంటూరు/చీరాల: చీరాలలో బాలూ యాదవ్‌ అనే కానిస్టేబుల్‌ ఏకంగా టీడీపీ పార్టీ కార్యాలయంలోకి ప్రవేశించి సీనియర్‌ నేత నక్కల రమణారావుపై దాడి చేయడంపై అధిష్ఠానం ఆరా తీస్తుంది. ఎవరీ బాలూయాదవ్‌.. అతడికి ఎందుకు నేతలు ప్రాధాన్యం ఇస్తున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. టీడీపీలోని మిగిలిన నేతలకు కూడా ఈ బాలు విషయం అంతుబట్టడంలేదు. టీడీపీ కార్యాలయంలో మూడు రోజుల క్రితం రమణారావుపై బాలు అనే కానిస్టేబుల్‌, మరో ఆరుగురుతో కలిసి దాడి చేయడం సంచలనంగా మారింది. సాక్షాత్తు టీడీపీ కార్యాలయంలో సీనియర్‌ నేతపైనే దాడి చేయడం దేనికి సంకేతమని ప్రజల్లో జోరుగా చర్చ సాగుతోంది. సామాజికంగా, ఆర్థికంగా బలమైన రమణారావు లాంటిపై వ్యక్తిపైనే దాడి జరిగితే తమ పరిస్థితి ఏమిటని పార్టీకి తొలి నుంచీ వెన్నుదన్నుగా ఉన్న నాయకులు ఆందోళన చెందుతున్నారు.


కానిస్టేబుల్‌పై చర్యలు

దాడిలో గాయపడిన బాధితుడు రమణారావు టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కానిస్టేబుల్‌ బాలు యాదవ్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. జరిగిన పరిణామాలను పరిశీలించిన ఎస్పీ వకుల్‌జిందాల్‌ సదరు కానిస్టేబుల్‌ను సస్పెండ్‌ చేశారు.

Updated Date - Jul 07 , 2024 | 09:49 AM

Advertising
Advertising
<