ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Andhra Pradesh: అవార్డులు స్వీకరించిన అధికారులు

ABN, Publish Date - Oct 22 , 2024 | 04:25 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐదు జలశక్తి అవార్డులు వచ్చాయి. ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ అధికారులు అవార్డులను స్వీకరించారు.

Five Jala Shakti Awards

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఐదు జలశక్తి అవార్డులను స్వీకరించింది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ అధికారులు ఈ రోజు ఢిల్లీలో అవార్డులను స్వీకరించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం జలశక్తి అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. తొమ్మిది విభాగాల్లో 38 అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మూడు విభాగాల్లో ఐదు అవార్డులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దక్కాయి. దక్షిణ జోన్‌లో ఉత్తమ జిల్లాగా విశాఖపట్టణం, ఉత్తమ గ్రామపంచాయితీగా అనంతపురం జిల్లాలోని హంపాపురం ఎంపిక చేశారు. నీటిని పొదుపుచేసిన ఉత్తమ విద్యాసంస్థల క్యాటగిరీలో కేఎల్‌యూ ఎడ్యుకేషన్ ఫౌండేషన్, తిరుపతి ఐఐటి, విశాఖపట్టణంలోని తిరుమల నగర్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్‌కు అవార్డు వచ్చింది.

Updated Date - Oct 22 , 2024 | 04:38 PM