ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Mahasena Rajesh:నాపై నీచ రాజకీయాలకు పాల్పడుతున్న జగన్ రెడ్డి

ABN, Publish Date - Mar 02 , 2024 | 05:33 PM

తనపై నీచ రాజకీయాలకు సీఎం జగన్ రెడ్డి ఆయన అనుచరులు పాల్పడుతున్నారని టీడీపీ పి.గన్నవరం ఇన్‌చార్జి మహాసేన రాజేష్(Mahasena Rajesh) అన్నారు. శనివారం నాడు సోషల్ మీడియాలో వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంబేద్కర్ కోనసీమ జిల్లా: తనపై నీచ రాజకీయాలకు సీఎం జగన్ రెడ్డి ఆయన అనుచరులు పాల్పడుతున్నారని టీడీపీ పి.గన్నవరం ఇన్‌చార్జి మహాసేన రాజేష్(Mahasena Rajesh) అన్నారు. శనివారం నాడు సోషల్ మీడియాలో వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ తనపై కుట్రలు చేస్తున్నారని.. ఇలా అయితే తాను రాబోయే ఎన్నికల్లో పోటీ చేయనని ఆవేదన వ్యక్తం చేశారు. కావాలనే తనపై వైసీపీ మూకలు కుతంత్రాలు చేస్తున్నాయని మండిపడ్డారు.

తనను పి.గన్నవరం ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం అభ్యర్థిగా ప్రకటించిన టీడీపీ- జనసేన శ్రేణులను సెంటిమెంటల్ బ్లాక్ మొయిల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని మీడియా సంస్థలు తాను గెలవనని తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. బ్రాహ్మణ సంఘాలు తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు, టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిని బ్రాహ్మణ సంఘాలు ముట్టడిస్తాయనే విధంగా కొంతమంది వైసీపీ మూకలు పోస్టింగ్‌లు చేయడం తనకు బాధనిపిస్తున్నాయని వాపోయారు. దయచేసి టీడీపీ, జనసేన శ్రేణులను ఇబ్బంది పెట్టవద్దని మహాసేన రాజేష్ చెప్పారు.

ఇవి కూడా చదవండి

Kollu Ravindra: బీసీ మహాసభ సాక్షిగా బీసీ డిక్లరేషన్‌ ప్రకటన

Atchannaidu: ప్రజలకు తాగునీరు అందించలేరా.. సిగ్గుచేటు..!

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 02 , 2024 | 05:43 PM

Advertising
Advertising