ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: పుడ్ డెలివరీ డ్రోన్లను సిద్ధం చేయండి.. సీఎం చంద్రబాబు ఆదేశం

ABN, Publish Date - Sep 02 , 2024 | 03:57 PM

Andhrapradesh: ఏపీ‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గ్రామాల్లోకి వరద నీరు వచ్చి చేరడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. వరద నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం.. వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేసింది. వరద ముంపుకు గురైన గ్రామాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

CM Chandrababu Naidu

అమరావతి, సెప్టెంబర్ 2: ఏపీ‌లో భారీ వర్షాలు (Heavy Rains) బీభత్సం సృష్టిస్తున్నాయి. గ్రామాల్లోకి వరద నీరు వచ్చి చేరడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. వరద నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం.. వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేసింది. వరద ముంపుకు గురైన గ్రామాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే వరద ముంపు ప్రాంతాల్లో ప్రజలకు ఆహారం, నీటిని సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం డ్రోన్లను ఉపయోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. డ్రోన్ల ద్వారా ఆహారాన్ని సరఫరా చేసేందుకు ప్రభుత్వం (AP Govt) సన్నద్దమవుతోంది.

Hevay Rains: విల్లాస్‌లోకి వరద నీరు.. కబ్జా వల్లే ఈ స్థితి అంటూ..


లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారికి డ్రోన్ల ద్వారా ఫుడ్ ప్యాకెట్లు అందించేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో డ్రోన్‌లను అధికారులు పరిశీలించారు. అలాగే ఫుడ్ బాస్కెట్స్ తీసుకెళ్లే విధానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు. డ్రోన్ల ద్వారా ఫుడ్ డెలివరీ విధానాన్ని సీఎంకు ఐ అండ్ ఐ సెక్రటరీ సురేష్ కుమార్ వివరించారు. 8 నుంచి10 కేజీల వరకు ఫుడ్, మెడిసిన్, నీటిని డ్రోన్ల సరఫరా చేయొచ్చని సురేష్ కుమార్ తెలిపారు. డ్రోన్ల ద్వారా ఫుడ్ సరఫరాపై సుముఖత వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు ఎన్ని వీలుంటే అన్ని ఫుడ్ డెలివరీ డ్రోన్లను సిద్దం చేసుకోవాలని అధికారులకు సూచనలు చేశారు.

Chandrababu: సీఎం చంద్రబాబు దెబ్బకు అధికారుల పరుగులు


వరద సహాయ చర్యల్లో నేవీ హెలీకాఫ్టర్లు...

వరద సహాయ చర్యల కోసం నేవీ హెలీకాప్టర్లు రంగంలోకి దిగాయి. ఇప్పటి వరకు నేవీ నుంచి మూడు హెలీకాప్టర్లు వచ్చాయి. హకింగ్‌పేట ఎయిర్ బేస్ నుంచి మరో నాలుగు హెలీకాఫ్టర్లు బయలుదేరాయి. వరద ముంపు ప్రాంతాల్లో హెలీ కాప్టర్ల ద్వారా ఆహారం, మంచినీరు సరఫరాకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇప్పటి వరకు 2,97,500 మందికి ఆహారం, మంచినీరు అందజేశారు. నిరాశ్రయుల కోసం విజయవాడ నగరంలో 78 పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా 17 చోట్ల రోడ్లు తెగిపోయాయి. దీంతో అధికార యంత్రాంగం పునరుద్ధరణకు చర్యలు చేపట్టింది. ప్రకాశం బ్యారేజీ నుంచి ప్రస్తుతం 11,41,276 క్యూసెక్కుల ప్రవాహం వచ్చిచేరుతోంది. వరద బాధితులకు ఆహారం, మంచినీరు పంపిణీ కార్యక్రమాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నిమగ్నమయ్యాయి. మరోవైపు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఎప్పటికప్పుడు వరద సహాయ చర్యలను పర్యవేక్షిస్తూ అధికారులకు సూచనలిస్తున్నారు.


ఇవి కూడా చదవండి...

CM Revanth: వరదల్లో చనిపోయిన వారి కోసం సీఎం రేవంత్ కీలక ప్రకటన

Deli Waqf Board case: 'ఆప్' ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ను అరెస్టు చేసిన ఈడీ

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 02 , 2024 | 03:59 PM

Advertising
Advertising