ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Varma: జగన్‌పై మాజీ ఎమ్మెల్యే వర్మ ఫైర్

ABN, Publish Date - Sep 13 , 2024 | 03:35 PM

Telangana: మాజీ సీఎం జగన్ ఏలేరు వరద ప్రాంతాల్లో పర్యటనకు రావడంపై పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... జగన్‌కు సిగ్గు శరం లేదంటూ వ్యాఖ్యలు చేశారు. ఏలేరు వరదలకు జగన్ కారణమని ఆరోపించారు.

Former MLA Varma

అమరావతి, సెప్టెంబర్ 13: మాజీ సీఎం జగన్ (Former CM YS Jagan) ఏలేరు వరద ప్రాంతాల్లో పర్యటనకు రావడంపై పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ (Former MLA Varma) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... జగన్‌కు సిగ్గు శరం లేదంటూ వ్యాఖ్యలు చేశారు. ఏలేరు వరదలకు జగన్ కారణమని ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు ఏలేరు ఆధునికీకరణకు నిధులు ఇస్తానని నిండు సభ సాక్షిగా గొల్లప్రోలులో సీఎం హోదాలో హామీ ఇచ్చారని గుర్తుచేశారు.

Supreme Court: విచారణకు సహకరించండి.. జోగి, అవినాశ్‌కు సుప్రీం ఆదేశం


కానీ ఒక్క పైసా ఇవ్వకుండా ప్రజలను, రైతులను జగన్ మోసం చేశారని మండిపడ్డారు. ఇప్పుడు వరదలకు అంతా మునిగిపోతే వచ్చి ఏం చెద్దామని జగన్ పర్యటిస్తున్నారని ప్రశ్నించారు. పచ్చి మోసగాడు జగన్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను ఇంకా మోసం చేయాలనే పర్యటించడానికి వచ్చారన్నారు. ఏలేరు ఆధునికీకరణకు చంద్రబాబు నిధులు ఇచ్చి పనులకు శంకుస్థాపన చేశారని.. తీరా జగన్ అధికారంలోకి వచ్చి రివర్స్ టెండరరింగ్ పేరుతో పనులు రద్దు చేశారని మండిపడ్డారు. ప్రస్తుతం ఏలేరు వరద ముంపు పాపం అంతా జగన్ దే అని అన్నారు. అందుకే గొల్లప్రోలు వెళ్ళడానికి భయపడి మామూలు ప్రాంతాల్లో తిరుగుతున్నారంటూ మాజీ ఎమ్మెల్యే వర్మ వ్యాఖ్యలు చేశారు.


ఇవి కూడా చదవండి...

YS Jagan: బాలినేని శ్రీనివాసరెడ్డితో విడదల రజినీ చర్చలు

AP Highcourt: జగన్‌కు భద్రత పిటిషన్‌‌పై విచారణ హైకోర్టులో వాయిదా

Read LatestAP NewsAndTelugu News

Updated Date - Sep 13 , 2024 | 03:36 PM

Advertising
Advertising