వైసీపీ నుంచి టీడీపీలోకి
ABN , Publish Date - Jan 23 , 2024 | 01:09 AM
మండలంలోని కోడూరు గ్రామంలో వైసీపీకి చెం దిన 7కుటుంబాలకు చెందిన 50 మంది టీడీపీ మండల అధ్యక్షుడు గడ్డి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు.

ఎ.కొండూరు, జనవరి 22: మండలంలోని కోడూరు గ్రామంలో వైసీపీకి చెం దిన 7కుటుంబాలకు చెందిన 50 మంది టీడీపీ మండల అధ్యక్షుడు గడ్డి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీ వైపు వస్తున్నారని కృష్ణారెడ్డి పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మండలంలో మరింతమంది పార్టీలో చేరతారని ఆయన తెలిపారు. టీడీపీ మండల కార్యదర్శి డేవిడ్రాజు, యలినేని చంద్రం, శావల కాంతారావు, శావల ఆశోక్ డేవిడ్రాజు, శ్రీనివాసరావు, నాగేశ్వరరావు పాల్గొన్నారు.