ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kollu Ravindra: పండుగ రోజు కూడా చంద్రబాబు ప్రజలతో ఉన్నారంటే..

ABN, Publish Date - Sep 07 , 2024 | 11:58 AM

Andhrapradesh: కుటుంబానికి దూరంగా పండుగరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరద బాధిత ప్రజలతో ఉన్నారంటే అంతకంటే ఏముంటుందని గనుల శాఖా మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... వరద ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు వచ్చే దాకా చంద్రబాబు ప్రభుత్వం ప్రజల వెంటే ఉంటుందని స్పష్టం చేశారు.

Minister Kollu Ravindra

అమరావతి, సెప్టెంబర్ 7: కుటుంబానికి దూరంగా పండుగరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) వరద బాధిత ప్రజలతో ఉన్నారంటే అంతకంటే ఏముంటుందని గనుల శాఖా మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... వరద ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు వచ్చే దాకా చంద్రబాబు ప్రభుత్వం ప్రజల వెంటే ఉంటుందని స్పష్టం చేశారు. తమ తప్పు వల్ల జరిగిన ప్రమాదానికి క్షమాపణ చెప్పాల్సింది పోయి జగన్ బురద రాజకీయం చేస్తుండడం దారుణమని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు.

Budameru: తగ్గుముఖం పట్టిన బుడమేరు వరద.. సింగ్‌నగర్ సేఫ్..


విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ..బుడమేరు మూడు గండ్లు పూడ్చడం దాదాపు పూర్తయిందని తెలిపారు. మరికాసేపట్లో పూర్తి నీరు అక్కడ నుంచి లీక్ అవడం ఆగిపోతుందన్నారు. ఇంకా జక్కంపూడి లాంటి కాలనీలు నీటిలో ఉన్నాయ్ కానీ వరద ఆగిపోతుంది కాబట్టి త్వరలో నీరు తోడేస్తామని తెలిపారు. సీఎం పండుగ రోజూ కూడా కలెక్టరేట్‌లో ఉన్నారంటే తమ ప్రభుత్వ చిత్త శుద్ధి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదని ఎంపీ కేశినేని చిన్ని పేర్కొన్నారు.


మరోవైు బుడమేరు గండ్ల పూడ్చివేత పనులు తుదిదశకు చేరుకున్నాయి. బుడమేరు గండ్ల పూడ్చివేత పనులను మంత్రి నిమ్మల రామానాయుడు దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నారు. నిన్న రాత్రి ఫ్లడ్ లైట్ల వెలుతురులోనూ పనులు కొనసాగాయి. మరికొద్దిగంటల్లో గండ్ల పూడ్చివేత పూర్తి పూర్తి అవుతుందని మంత్రి నిమ్మల తెలిపారు. నేటితో బుడమేరు వరద నుంచి విజయవాడ ప్రజలకు విముక్తి కలిగిస్తామని చెప్పారు. విపత్తుతో వేలాది మంది పడుతున్న కష్టంతో పోల్చితే తమ కష్టం ఎంత అని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

Nimmala Ramanaidu: కాసేపట్లో బుడమేరు వరద నుంచి బెజవాడ వాసులకు విముక్తి

Mahesh Kumar Goud: రేవంత్ తర్వాత పీసీసీ కావడం బిగ్ టాస్క్.. తొలిసారి ఏబీఎన్‌తో మహేశ్ గౌడ్

Read Latest AP News And Telngana News

Updated Date - Sep 07 , 2024 | 12:13 PM

Advertising
Advertising