Home » Kollu Ravindra
గనుల శాఖపై తీవ్ర ఆరోపణల నేపథ్యంలో, మంత్రి కొల్లు రవీంద్ర ఓఎస్డీగా నియమించిన పి. రాజాబాబును సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రభుత్వం తొలగించింది. ఆయనపై గతంలోనూ అవినీతి ఆరోపణలు ఉన్నా, మంత్రి పట్టుబడి నియమించగా.. ఇప్పుడు అవే ఆరోపణలు అధికారుల వైఖరిని ప్రశ్నించాయి
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. జగన్.. ఆ మాటలేంటి.. అంటూ వ్యాఖ్యానించారు. పోలీసులను బట్టలూడదీసి కొడతానని అనడంపై ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి మాట్లాడే మాటలు ఇవేనా అంటూ ప్రశ్నించారు.
బెల్టు షాపుల మీద ఉక్కు పాదం మోపుతున్నామని, బెల్టు షాపు అనుబంధంగా ఉన్న షాపుల లైసెన్స్ రద్దు చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా దాడులు, హత్యలు, అక్రమ కేసులతో రెచ్చిపోయారని, 44 రోజుల పాటు తాను కూడా రాజమండ్రి జైల్లో ఉన్నానని చెప్పారు.
ఆగస్టు తరువాత నాటు సారా కనిపించకూడదనే లక్ష్యంతో మంత్రి కొల్లు రవీంద్ర ఎక్సైజ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. చిత్తూరు జిల్లాను ఆదర్శంగా తీసుకుని గంజాయి, మత్తు పదార్థాల నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు
Kollu Ravindra Fire On Perni Nani: మద్యంలో వైసీపీ హయాంలో జరిగిన అవినీతిపై సీఐడీ ఎంక్వైరీ జరుగుతోందని.. సిట్ను ఏర్పాటు చేశామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. సిట్ వేసిన సాయంత్రం తాడేపల్లిలో ఫైల్స్ దగ్ధం చేశారన్నారు. ఏ తప్పు చేయకపోతే ఫైల్స్ తగలబెట్టడం ఎందుకు..? ముందస్తు బెయిల్ ఎందుకు అని ప్రశ్నించారు.
Minister Kollu Ravindra: మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి కొల్లు రవీంద్ర సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో మద్యం తయారీ నుంచి అమ్మకం వరకు అన్నింటిలో అవినీతి జరిగిందని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు.
వైసీపీ ప్రభుత్వంలో మద్యంఅమ్మకాల్లో అక్రమాలకు పాల్పడి రూ.3,113 కోట్లు దోచుకున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అసెంబ్లీలో చెప్పారు.
AP Budget Reactions: ఏపీ బడ్జెట్పై అధికార, విపక్ష నేతలు పలు రకాలుగా స్పందించారు. బడ్జెట్ అద్బుతం అని అధికార పక్షం నేతలు చెబుతుండగా.. బడ్జెట్లో అంతా అరకొరకే నిధులు కేటాయించారని.. హామీలు పూర్తిగా విస్మరించారని విపక్ష నేతలు వ్యాఖ్యలు చేశారు.
2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అలాగే శాసన మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అనంతరం వ్యవసాయ బడ్జెట్ను మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో సమర్పించనున్నారు. మండలిలో మంత్రి నారాయణ వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెడతారు.
అధర్మంగా, దుర్గార్గంగా వ్యవహరించిన ప్రతి ఒక్కరినీ ధర్మం శిక్షిస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ లను పోసాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి దూషించాడని, ఇంట్లో ఉన్న ఆడ బిడ్డల గురించి కూడా చాలా అసహ్యంగా మాట్లాడాడని మంత్రి మండిపడ్డారు. సోషల్ మీడియాలో ఆడబిడ్డలపై అనుచిత పోస్టులు పెట్టే ఏ ఒక్కరినీ ఉపేక్షించమని స్పష్టం చేశారు.