కోడుమూరులో వైసీపీకి భారీ షాక్
ABN , Publish Date - Mar 06 , 2024 | 12:24 AM
కోడుమూరు నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది.

పులకుర్తి, కోడుమూరు నుంచి టీడీపీలోకి వలసలు
కర్నూలు(రూరల్), మార్చి 5: కోడుమూరు నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. టీడీపీ ఆధినేత చంద్రబాబు బొగ్గుల దస్తగిరికి అసెంబ్లీ టికెట్ కేటాయించినప్పటి నుంచి వరుసగా వైసీపీని వీడి టీడీపీలోకి వలసలు పెరి గాయి. మంగళవారం కోడుమూరు పట్టణానికి చెందిన స్థానిక ఎమ్మెల్యే డా.సుధాకర్ వర్గానికి చెందిన వైసీపీ యువనాయకులు బోయ బలరాముడు, కౌలుట్ల, రాజోలు గిడ్డయ్య, బ్రిటీష్ రాముడు ఆధ్వర్యంలో దాదాపు 13 వాహ నాల్లో బయలుదేరి 300 మంది వైసీపీ కుటుంబాలు కర్నూలులో టీడీపీ సీని యర్ నేత విష్ణువర్ధన్రెడ్డి, బొగ్గుల దస్తగిరి ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. ఈసందర్భంగా విష్ణువర్ధన్రెడ్డి మాట్లాడుతు రాష్ట్రంలో టీడీపీ గెలుపు చారిత్రక అవసరమన్నారు. టీడీపీలోకి చేరిన వారిలో సీపీఐ రాముడు, లక్ష్మీదేవి, అనిత, సుజాత, వెంటలక్ష్మీ, సువర్ణ, పెద్ద బోయగేరికి చెందిన మహిళలు ఉన్నారు.
ఫ కోడుమూరు మండలం పులకుర్తి గ్రామానికి చెందిన వైసీపీ నాయ కు డు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ఇమ్మానియేలు (ఎమ్మెల్యే వర్గం) తన అనుచ రులతో కలిసి విష్ణువర్ధన్రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. ఆయనతో పాటు డాక్టర్ గోపాల్, లక్ష్మన్న, క్రిష్ణ, చంద్రశేఖర్, వీరన్న, డా.పవన్, నాగేంద్ర, నల్లన్న, గోకారి,శ్రీను, తిమ్మప్ప, నాగప్ప, చిన్నఎల్లప్ప, రాజు, చిన్న సుంకన్న, వడ్డెశ్రీను, గిరి, విజయ్తోపాటు మరో 80మంది దాక వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. ఈసందర్భంగా వైసీపీ నాయకుడు ఇమ్మానియేలు మాట్లాడుతూ ఐదేళ్ల వైసీపీ పాలనలో అనేక గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదన్నారు. కార్యక్రమంలో పుల కుర్తి టీడీపీ నాయకుడు త్రివేద్ పాల్గొన్నారు.