ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Adala Prabhakar Reddy: నెల్లూరులో రెచ్చిపోయిన మాజీ ఎంపీ ఆదాల అనుచరులు..

ABN, Publish Date - Jun 22 , 2024 | 03:56 PM

వైసీపీ మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి(YSRCP former MP Adala Prabhakar Reddy) వ్యాపార భాగస్వామి ప్రసాద్ చౌదరి(Prasad Chaudhary)పై ఆయన అనుచరులు విచక్షణ రహితంగా దాడులకు పాల్పడడం నెల్లూరులో సంచలనంగా మారింది. ప్రసాద్ చౌదరిని ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇంటి నుంచి నడిరోడ్డు పైకి తరిమి మరీ దాడి చేయడంతో ప్రయాణికులు, స్థానికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు.

నెల్లూరు: వైసీపీ మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి(YSRCP former MP Adala Prabhakar Reddy) వ్యాపార భాగస్వామి ప్రసాద్ చౌదరి(Prasad Chaudhary)పై ఆయన అనుచరులు విచక్షణ రహితంగా దాడులకు పాల్పడడం నెల్లూరులో సంచలనంగా మారింది. ప్రసాద్ చౌదరిని ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇంటి నుంచి నడిరోడ్డు పైకి తరిమి మరీ దాడి చేయడంతో ప్రయాణికులు, స్థానికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. నడిరోడ్డుపై దుర్భాషలాడుగా మూకుమ్మడిగా దాడి చేయడంతో బాధితుడు తీవ్రంగా గాయపడ్డాడు.


మాజీ ఎంపీ ఆదాల డబ్బులు తీసుకుని భూములు రిజిస్ట్రేషన్ చేయలేదని.. ప్రశ్నించినందుకు అనుచరులతో దాడి చేయించాడని ప్రసాద్ చౌదరి ఆరోపించారు. భూములు రిడిస్ట్రేషన్ చేయాలని లేకుండా డబ్బులు తిరిగి ఇచ్చేయాలంటూ అడగ్గా.. ఆదాల అనుచరులు దాడి చేసి తీవ్రంగా హింసించారని బాధితుడు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రభాకర్ రెడ్డి, ఆయన అల్లుడు కిరణ్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తిరిగి వచ్చాక ఇలా దాడులకు పాల్పడడంతో ఇందేటని నెల్లూరు వాసులు నోరెళ్ల బెడుతున్నారు.

ఇది కూడా చదవండి:

Ayyannapatrudu: నా రాజకీయ జీవితంలో ఇలాంటి నేతను చూడలేదు.. అయ్యన్నపాత్రుడు షాకింగ్ కామెంట్స్

Updated Date - Jun 22 , 2024 | 03:56 PM

Advertising
Advertising