ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TDP-Janasena: టీడీపీ-జనసేన ఎన్నికల గుర్తులతో సరికొత్త లోగో ఆవిష్కరణ

ABN, Publish Date - Jan 02 , 2024 | 02:31 PM

Andhrapradesh: జగన్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లటమే లక్ష్యంగా రేపటి (బుధవారం) నుంచి "రా కదలి రా!" పేరిట కార్యక్రమాలకు టీడీపీ శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం - జనసేన ఎన్నికల గుర్తులతో సరికొత్త లోగో ఆవిష్కృతమైంది. మంగళవారం సైకిల్ - గాజు గ్లాసుతో కూడిన లోగోను పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు ఆవిష్కరించారు.

అమరావతి, జనవరి 2: జగన్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లటమే లక్ష్యంగా రేపటి (బుధవారం) నుంచి "రా కదలి రా!" పేరిట కార్యక్రమాలకు టీడీపీ శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం - జనసేన ఎన్నికల గుర్తులతో సరికొత్త లోగో ఆవిష్కృతమైంది. మంగళవారం సైకిల్ - గాజు గ్లాసుతో కూడిన లోగోను పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు (AP TDP Chief Atchannaidu) ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. పార్టీ ఆవిర్భావం సందర్భంగా ఎన్టీఆర్ ఇచ్చిన ‘‘రా కదలిరా’’ పిలుపునే మళ్లీ ప్రజల్లోకి తీసుకెళ్తున్నామన్నారు. విధ్వంసాలు, వైఫల్యాలు తప్ప జగన్ పాలనలో అభివృద్ధి అనేది భూతద్దంలో వెతికినా కనిపించదని విమర్శించారు. రాష్ట్రాన్ని చీకటిమయం చేసి ఆంధ్రప్రదేశ్‌ను ఆందోళనప్రదేశ్‌గా మార్చిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని మండిపడ్డారు. స్వర్ణయుగం తెలుగుదేశంతోనే సాధ్యమనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నామని తెలిపారు. అన్ని సభలు తెలుగుదేశం - జనసేన సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతాయన్నారు. చంద్రబాబు - పవన్ కళ్యాణ్ కలిసి పాల్గొనే సభలు త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు.

పార్లమెంట్ స్థాయి బహిరంగ సభలతో సంబంధo లేకుండా మేనిఫెస్టో ప్రకటన సభను ప్రత్యేకంగా నిర్వహిస్తామన్నారు. వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చేందుకు ఎంతోమంది సంపప్రదిస్తున్నారని అన్నారు. కొత్త, పాత వారి సమన్వయం కోసం ఓ కమిటీ ఇప్పటికే పనిచేస్తోందన్నారు. వైసీపీ నుంచి వచ్చే వారి పట్ల ఆచితూచి వ్యవహరిస్తామని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.


టీడీపీ-జనసేన చేపట్టబోయే కార్యక్రమాల వివరాలు...

  • పంచాయితీ సమస్యలపై రేపు సర్పంచ్‌లతో రాష్ట్ర స్థాయి సదస్సు

  • బీసీలకు జరిగిన అన్యాయంపై 4న జయహో బీసీ పేరిట రాష్ట్ర స్థాయి సదస్సు

  • 5వ తేదీ నుంచి 29 వరకూ అన్ని పార్లమెంట్ స్థానాల్లో చంద్రబాబు బహిరంగ సభలు

  • 5న ఒంగోలు, 7న విజయవాడ, నరసాపురం పార్లమెంట్ పరిధిలో సభలు

  • 18న ఎన్టీర్ వర్ధంతి సందర్భంగా గుడివాడలో భారీ సభ

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 02 , 2024 | 02:31 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising